![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/sports/libra_libra/iplb95ad0a3-c1f8-4a43-84cf-5040692ff97e-415x250.jpg)
ఇప్పటి వరకు ఐపీఎల్ 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ పునాదులు పడ్డాయి. ఈ ఏడాది జరగబోయేది 18 వ సీజన్ కావడం గమనార్హం. ప్రస్తుత సీజన్లో నిర్వహించే ఫైనల్ మ్యాచ్ తో పాటు ప్లే ఆఫ్ -2 మ్యాచ్ కూడా కోల్ కతా వేదికగానే నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం... ప్రతి సంవత్సరం ప్రారంభ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్, మరొక జట్టు తలపడతాయి. ఈ ఏడాది తొలి మ్యాచ్ కోల్ కతా, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. అంతేకాకుండా ప్రతి జట్టు సొంత మైదానంలో సగం మ్యాచ్ లలో తలపడాల్సి వస్తుంది. మిగతా మ్యాచ్ లు ప్రత్యర్థి మైదానాలలో ఆడాల్సి ఉంటుంది.
అయితే గతంలో దానికంటే, భిన్నంగా ఈసారి ఢిల్లీ, రాజస్థాన్ జట్లు తమ సొంత మైదానాలతో పాటు, ఇతర మైదానాలలో కూడా తలపడనున్నాయి. రాజస్థాన్ జట్టుకు సవాయి మాన్సింగ్ స్టేడియం సొంతమైదానం కాగా ఇది జైపూర్ నగరంలో ఉంది. ఈ నగరంలో 5 మ్యాచ్లను రాజస్థాన్ ఆడబోనుంది. ఆ తర్వాత అస్సాంలోని బర్సా పారా మైదానంలో మిగతా మ్యాచ్లు ఆడుతుంది. ఢిల్లీ జట్టుకు అరుణ్ జెట్లీ మైదానం సొంత గ్రౌండ్ కాగా ఇది ఢిల్లీ నగరంలో ఉందనే విషయం విదితమే. ఆ తర్వాత విశాఖపట్నంలోని క్రికెట్ మైదానంలో మిగతా మ్యాచులు ఆడుతుంది. ఐపీఎల్ పేరుకు తగ్గట్టుగానే ఈ సీజన్లో ఆటగాళ్లపై అన్ని జట్లు డబ్బుల వర్షం గుమ్మరించాయి. దాదాపు 182 మంది ఆటగాళ్ల కోసం 639.5 కోట్లను వెచ్చించడమంటే సాధారణమైన విషయం కాదు!