
అది చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే ఇదివరకే కారు ప్రమాదంలో పంత్ ఇదే మోకాలికి తీవ్ర గాయంతో చాలా కాలం క్రికెట్కు దూరంగా ఉన్నాడు. మళ్లీ అదే మోకాలికి గాయం కావడంతో టీమ్ మేనేజ్మెంట్, ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. పంత్ కాసేపు నొప్పితో బాధపడుతూ కుంటుతూ కనిపించాడు. వెంటనే డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత మోకాలికి బ్యాండేజ్ కట్టుకుని మళ్లీ బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో టీమ్ మేనేజ్మెంట్, ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే పంత్ మాత్రం కూల్గా కనిపించాడు. ట్రీట్మెంట్కు వెళ్లేముందు హార్దిక్ను హత్తుకుని నవ్వేశాడు. ఆపై నెట్స్లో బ్యాటింగ్ చేస్తూ అక్షర్ పటేల్తో కలిసి సరదాగా కబుర్లు చెప్పాడు. పంత్ మళ్లీ బ్యాటింగ్ చేయడంతో గాయం పెద్దది కాదని అర్థమైంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో పంత్ టీమిండియాకు చాలా కీలకం. అతను మ్యాచ్ విన్నర్. ఒంటిచేత్తో మ్యాచ్ను తిప్పేసే సత్తా ఉన్న ప్లేయర్. వన్డేలు, టీ20ల్లో 100+ స్ట్రైక్ రేట్తో ఆడే పంత్ జట్టుకు చాలా అవసరం. రాబోయే రోజుల్లో పంత్ ఫిట్నెస్పై టీమ్ మేనేజ్మెంట్ క్లోజ్గా చూస్తూ ఉంటుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో దుబాయ్లో జరిగే మ్యాచ్లో పంత్ బరిలోకి దిగుతాడా లేదా అనేది చూడాలి. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్తో, ఫిబ్రవరి 27న న్యూజిలాండ్తో కూడా దుబాయ్లోనే మ్యాచ్లు ఉన్నాయి. గతంలో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని రెండుసార్లు గెలిచింది. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్తంగా విజేతగా నిలిచింది. 2013లో ఇంగ్లాండ్ను ఓడించి టైటిల్ కొట్టింది. ఈసారి కూడా దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో పంత్ తన ఫామ్ను కంటిన్యూ చేస్తే ఇండియా మరోసారి ఛాంపియన్ అయ్యే ఛాన్స్ ఉంది.