పాకిస్థాన్‌లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో టెర్రరిస్టులు రెచ్చిపోవచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో పాక్ సెక్యూరిటీ ఫోర్సులు అలెర్ట్ అయ్యాయి. మీడియా రిపోర్ట్ ప్రకారం.. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) అనే టెర్రర్ గ్రూప్ దాడులకు ప్లాన్ చేస్తోందట. టోర్నీ చూడటానికి వచ్చే విదేశీయుల్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని చూస్తున్నారని పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ బ్యూరో (IB) హెచ్చరించింది.

ISKP ఇప్పటికే పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఆఫీసులు, ఇళ్ల దగ్గర నిఘా పెట్టిందని సమాచారం. ముఖ్యంగా చైనా, అరబ్ దేశాల వాళ్లే వాళ్ల టార్గెట్ అని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ గూఢచారి సంస్థ (GDI) కూడా ISKP దాడులు చేసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.

ISKPతో పాటు తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), ఐసిస్, బలూచిస్థాన్ గ్రూపులు లాంటి ఇతర టెర్రర్ గ్రూపుల మీద కూడా పాక్ నిఘా పెట్టింది. ఈ గ్రూపులు కూడా టోర్నీ టైమ్‌లో దాడులు చేసే ఛాన్స్ ఉందని CNN- న్యూస్18 రిపోర్ట్ వెల్లడించింది. దీంతో పాక్‌ రేంజర్లు, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ప్రాబ్లమ్ ఉన్న ఏరియాల్లో సెక్యూరిటీ పెంచేశారు. ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్‌కు లాహోర్, కరాచీ, రావల్పిండి సిటీల్లో భద్రతను భారీగా పెంచారు. ఈ మూడు సిటీల్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి.

పాకిస్థాన్‌లో సెక్యూరిటీ సరిగా లేకపోవడం వల్ల చాలా కాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ జరగడం లేదు. 2009లో శ్రీలంక టీమ్ బస్సుపై టెర్రరిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో చాలా మంది క్రికెటర్లు, అధికారులు గాయపడ్డారు. దీంతో దాదాపు పదేళ్ల పాటు పాకిస్తాన్‌లో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగలేదు. పాక్ టీమ్ తమ హోమ్ మ్యాచ్‌లు యూఏఈలో ఆడుకోవాల్సి వచ్చింది. 2019 నుంచే మళ్లీ పెద్ద జట్లు పాకిస్తాన్ టూర్‌కు రావడం మొదలుపెట్టాయి.

అయితే ఇండియా మాత్రం సెక్యూరిటీ రిస్క్స్‌ వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌ వెళ్లడానికి ఒప్పుకోలేదు. అందుకే కొన్ని మ్యాచ్‌లు దుబాయ్‌కి మార్చారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ టీమ్‌లు కనీసం ఒక్క మ్యాచ్ అయినా పాకిస్తాన్‌లో ఆడతాయి. కానీ ఇండియా మాత్రం అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడుతుంది. గ్రూప్ Bలో ఉన్న ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ టీమ్‌ల మ్యాచ్‌లన్నీ పాక్‌లోనే జరుగుతాయి. కానీ ఈ గ్రూప్ నుంచి సెమీ-ఫైనల్‌కు వెళ్లే టీమ్ ఇండియాను ఎదుర్కోవాల్సి వస్తే, ఆ మ్యాచ్ మాత్రం దుబాయ్‌లో జరుగుతుంది.

టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడంపై కొందరు క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. ఇండియా అన్ని మ్యాచ్‌లు ఒకే చోట ఆడుతుండటంతో వాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుందని అంటున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా పాక్‌కు హోస్టింగ్ రైట్స్ ఇవ్వడం కరెక్టేనా? అనే దానిపై ఇంకా డిబేట్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: