కాలం ఎంత విచిత్రమైనదో ఒక్కోసారి మనమే ఊహించలేం. సొంతగడ్డపై ఘనంగా ఆరంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ సంబరాలు ఆవిరయ్యేందుకు ఆరు రోజులు కూడా పట్టలేదు. ఆతిథ్య దేశంగా బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు, టోర్నీ ప్రారంభమైన కొద్ది రోజులకే ఇంటిదారి పట్టింది. భారత్, న్యూజిలాండ్‌ చేతిలో వరుసగా చిత్తు కావడంతో, పాక్ జట్టు సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వారి ప్రయాణం ముగియడం నిజంగా షాకింగ్.

దశాబ్దాల తర్వాత సొంతగడ్డపై ఐసీసీ టోర్నీ జరుగుతుంటే, పాకిస్థాన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కానీ, ఆ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు. కేవలం ఆరు రోజుల్లోనే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పుడు మిగిలింది ఒక నామమాత్రపు మ్యాచ్ మాత్రమే. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ తలపడుతుంది. అయితే, ఈ మ్యాచ్ కేవలం లాంఛనప్రాయమే. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ మ్యాచ్ ఆడినా ఒకటే, ఆడకున్నా ఒకటే.

పాకిస్థాన్ క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా జీర్ణించుకోలేని అవమానం. సొంతగడ్డపై, అది కూడా ఇంత ప్రతిష్టాత్మక టోర్నీలో ఇలాంటి పరాభవం ఎదుర్కోవడం నిజంగా బాధాకరం. క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ జట్టుకు ఇది ఒక మరపురాని మచ్చగా మిగిలిపోతుంది. ఈ పరాభవం నుంచి పాకిస్తాన్ జట్టు ఎలా కోలుకుంటుందో చూడాలి మరి. ఫ్యాన్స్ మాత్రం ఈ అవమానాన్ని అసలు తట్టుకోలేకపోతున్నారు ప్రతిసారి ఇండియా చేతిలో ఓడిపోవడం ప్రపంచ వేదిక మీద తమ పరువు పోవడం బాధ కలిగిస్తోందని అంటున్నారు.


ఇండియా పాకిస్తాన్ రెండు కూడా రెండు వేర్వేరు గ్రూప్స్ లో ఉంచాలని అప్పుడే తమకు అవమానం జరగకుండా ఉంటుందని అంటున్నారు మనీ కోసం ఇలా పాకిస్తాన్ ని బలి చేయడం ఏం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ తమ టీము పాకిస్తాన్ ఇండియా అనే చిత్తు చేస్తుందని టీమ్ వ్యక్తం చేయలేకపోవడం  గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: