క్రికెట్ ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మ్యాచ్ వేదిక మారింది. ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన మ్యాచ్‌ని గువహటికి తరలించారు. ఎందుకంటే అదే రోజు రామ్ నవమి ఉండటంతో భద్రతా కారణాల వల్ల కోల్‌కతా పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు.

క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) ప్రెసిడెంట్ స్నేహశిష్ గంగూలీ స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మ్యాచ్‌ని వేరే డేట్‌కి మార్చమని బీసీసీఐని అడిగామని, కానీ కోల్‌కతాలో వేరే డేట్ కుదరకపోవడంతో వేదికనే గువహటికి మార్చాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా రామ్ నవమి వల్ల కోల్‌కతా ఐపీఎల్ మ్యాచ్‌లు షిఫ్ట్ అయ్యాయి. 2024లో KKR vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఏప్రిల్ 17 నుంచి ఏప్రిల్ 16కు మార్చారు. అప్పుడు కూడా సెక్యూరిటీ ప్రాబ్లమ్సే కారణం. అంతేకాదు, అప్పుడు ఇంకో రెండు మ్యాచ్‌లు కూడా ఇలాగే రీషెడ్యూల్ చేశారు.

వేదిక మారడంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ మ్యాచ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. రెండు టీమ్స్‌కి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో మ్యాచ్ అదిరిపోతుందని అనుకున్నారు. దాదాపు 65 వేల మంది పట్టే ఈడెన్ గార్డెన్స్ ఇప్పుడు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ని మిస్ అవుతుంది.

ఇదిలా ఉంటే, గువహటిలో ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. మార్చి 26, 30 తేదీల్లో RR మ్యాచ్‌లు అక్కడ షెడ్యూల్ చేశారు. ఇప్పుడు కొత్తగా KKR వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ కూడా గువహటిలోనే జరుగుతుంది. కాకపోతే ఇది KKR హోమ్ మ్యాచ్ కాదు, అవే మ్యాచ్. ఈ మ్యాచ్ మార్చి 26న గువహటిలో జరగనుంది.

KKR టీమ్ ఐపీఎల్ 2025 సీజన్‌ను మార్చి 22న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈడెన్ గార్డెన్స్‌లోనే స్టార్ట్ చేస్తుంది. కానీ వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ఆ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ కూడా ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: