ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగే అతిపెద్ద క్రికెట్ పండగ వచ్చేసింది .. భారతీయ ప్రేక్షకులు సినిమా తో పాటు క్రికెట్ కి కూడా వారి జీవితం లో పెద్ద పేట వేస్తారనేది అందరికీ తెలిసిందే .. ఇక మరి నిన్న స్టార్ట్ అయిన ఐపీఎల్ మ్యాచ్లపై భారీ హైప్‌ నెలకొంది .. ఇప్పటికే నిన్న బెంగళూరు వర్సెస్ కోల్కత్తా జట్లు మధ్య స్టార్ట్ అయిన ఐపీఎల్ ఈరోజు భారీ ఫాలోయింగ్ ఉన్న టీమ్ లు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ముంబై ఇండియన్స్ మధ్య భారీ పోరు జరగబోతుంది .

అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ ల‌లో ధోని కోసం కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి గాఎదురు చూస్తున్నారని చెప్పటం లో ఎలాంటి సందేహం లేదు .. అయితే ఈరోజు మ్యాచ్ మొదలు కాకముందు ధోని ఇచ్చిన ఒక సాలిడ్ స్టేట్మెంట్ ఇప్పుడు స్పోర్ట్స్ సహా తన ఫాన్స్ లో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది .. కచ్చితంగా ఐపీఎల్ ఫ్రాంచేజి కి ధోని వల్ల చాలా పేరు వచ్చింది .. తానులేని ఐపీఎల్ గాని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గాని ఊహించుకోవడం ఎంతో కష్టం ..

అందుకే తనకి ఇంత ఏజ్ వ‌చ్చిన‌ కూడా తనని తన క్రేజ్‌తో కొనసాగిస్తున్నాడు .. ఇక మరి ఈ ఏడాది ఐపీఎల్ తో ధోనీ కి ఇదే లాస్ట్ ఐపీఎల్ అని చాలా మంది భావిస్తున్నారు .. కానీ ధోని ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు అభిమానుల కి మంచి కి కిక్‌ ఇచ్చింది .. చెన్నై ఫ్రాంచైజీ నాది నేను ఎంత కాలం కావాల్తే అంత కాలం అందులో ఆడతాను నేను వీల్ చైర్ లో ఉన్న కూడా మా వాళ్ళు నన్ను ఆడడానికి లాక్ వస్తారు అంటూ ఆయన చేసిన్న స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పాటు క్రికెట్ అభిమానుల్లో కూడా ఎంతో వైరల్ గా మారాయి . ఇక మరి ఈరోజు మ్యాచ్లో ధోని ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: