
అశ్విని కుమార్ తన ఫస్ట్ బాల్తోనే అజింక్య రహానేను అవుట్ చేసి అదిరిపోయే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. దీంతో ఐపీఎల్ డెబ్యూలోనే వికెట్ తీసిన ఎలైట్ బౌలర్ల లిస్టులో చేరిపోయాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన 10వ ప్లేయర్గా, ముంబై ఇండియన్స్ నుంచి నాల్గో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ముంబై తరఫున అలీ ముర్తజా, అల్జారీ జోసెఫ్, డెవాల్డ్ బ్రేవిస్ ఈ ఘనత సాధించారు. విశేషం ఏంటంటే.. ఐపీఎల్ డెబ్యూలో నాలుగు వికెట్లు తీసిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ కూడా అశ్వినినే.
చండీగఢ్ దగ్గర్లోని ఝంజేరి అనే చిన్న టౌన్ నుంచి వచ్చాడు అశ్విని కుమార్. డేంజరస్ బౌన్సర్లు, వెరైటీ పేస్, కచ్చితమైన వైడ్ యార్కర్లు వేయడంలో దిట్ట. 2024 షేర్-ఎ-పంజాబ్ టీ20 ట్రోఫీలో అశ్విని డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఇండియన్స్ కళ్లలో పడ్డాడు.
ఐపీఎల్ ఎంట్రీకి ముందు 2022 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు అశ్విని. కానీ, కేవలం నాలుగే మ్యాచ్లు ఆడి 8.50 ఎకానమీతో 3 వికెట్లు మాత్రమే తీశాడు. పంజాబ్ తరఫున రెండు ఫస్ట్-క్లాస్, నాలుగు లిస్ట్ A మ్యాచ్లు కూడా ఆడాడు. 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అతడిని 30 లక్షలకు కొనుక్కుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్కు ఆడినా అతడికి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే ఛాన్స్ రాలేదు.
మ్యాచ్ తర్వాత ఇన్నింగ్స్ బ్రేక్లో అశ్విని తన సంతోషాన్ని పంచుకున్నాడు. "చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్లో కొంచెం ప్రెజర్ అనిపించింది. కానీ టీమ్ వాతావరణం నన్ను కూల్గా ఉండటానికి హెల్ప్ చేసింది" అని చెప్పాడు.
మ్యాచ్కు ముందు టెన్షన్ గురించి చెబుతూ.. "ప్రెజర్ వల్ల ఆకలి అనిపించలేదు. అందుకే జస్ట్ ఒక బనానా తిన్నా అంతే. బేసిక్ ప్లాన్ తోనే బరిలోకి దిగాను. టీమ్ నన్ను ఎంజాయ్ చేయమని చెప్పడంతో నా స్ట్రెంగ్త్స్పైనే ఫోకస్ పెట్టాను" అని అన్నాడు.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇచ్చిన సలహాలను కూడా అశ్విని గుర్తు చేసుకున్నాడు. "షార్ట్ బాల్స్ వేయమని, బాడీని టార్గెట్ చేయమని హార్దిక్ భాయ్ చెప్పాడు. అందుకే ఫస్ట్ వికెట్ అలానే తీశాను" అని వివరించాడు.
"మా ఊరిలో అందరూ ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. దేవుడి దయ వల్ల నాకు ఛాన్స్ వచ్చింది, బాగా చేశాను" అంటూ అశ్విని ఆనందం వ్యక్తం చేశాడు.