నికోలస్‌ పూరన్‌.. వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాటర్‌.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL) సరికొత్త చరిత్ర సృష్టించాడు. IPL హిస్టరీలోనే వేగంగా 2000 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు.

పూరన్ విధ్వంసం అంటే మామూలుగా ఉండదు. కేవలం 36 బంతుల్లోనే అజేయంగా 87 పరుగులు పిండేశాడు. ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 భారీ సిక్స్‌లు బాదేశాడు. పూరన్ పవర్ హిట్టింగ్‌తో లక్నో టీమ్ భారీ స్కోరు కొట్టింది. KKR టీమ్‌కి మాత్రం భారీ టార్గెట్ పెట్టి ప్రెషర్ పెంచేశాడు.

మ్యాచ్‌లో హైలైట్ మూమెంట్ ఏదంటే.. 18వ ఓవర్లో పూరన్.. KKR ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌ బౌలింగ్‌లో ఏకంగా 24 పరుగులు కొట్టడం. రెండు సిక్సులు, మూడు బౌండరీలు దంచికొట్టాడు. పూరన్ డామినేషన్‌కి ఇది ఒక శాంపిల్.

ఈ ఇన్నింగ్స్‌తో పూరన్ IPL‌లో 2000 పరుగుల మైలురాయిని దాటేశాడు. ఇప్పటివరకు 81 మ్యాచ్‌లలో 78 ఇన్నింగ్స్‌లు ఆడి.. 2,057 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ మాత్రం 168.88. యావరేజ్ కూడా 34.86గా ఉంది. IPL కెరీర్‌లో 12 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఈ 87 పరుగులే తన బెస్ట్ స్కోరు.

పూరన్ ఈ 2000 పరుగుల మార్క్‌ని కేవలం 1,198 బంతుల్లోనే అందుకున్నాడు. అంతకుముందు ఆండ్రీ రస్సెల్ 1,120 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. బంతుల పరంగా చూస్తే.. పూరన్ ఇప్పుడు రెండో ఫాస్టెస్ట్ బ్యాటర్‌. సెహ్వాగ్‌ రికార్డుని బ్రేక్ చేశాడు.

ముందుగా పూరన్ 2019 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్ టీమ్‌కి ఆడాడు. 33 మ్యాచ్‌లలో 606 పరుగులు చేశాడు. తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వెళ్లాడు. అక్కడ 14 మ్యాచ్‌లలో 306 పరుగులు చేశాడు. లక్నో టీమ్‌లోకి వచ్చాక మాత్రం పూరన్ ఫామ్ మామూలుగా లేదు. ఈ టీమ్ కోసం 34 మ్యాచ్‌లలో 1,145 పరుగులు చేశాడు. యావరేజ్ 47.70, స్ట్రైక్ రేట్ 186 పైనే ఉంది. లక్నో టీమ్ తరపున 8 హాఫ్ సెంచరీలు బాదేశాడు.

KKRతో మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి లక్నో టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్ కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్క్‌రమ్ 28 బంతుల్లో 47 పరుగులు, మార్ష్ 48 బంతుల్లో 81 పరుగులు చేశారు. తర్వాత పూరన్, మార్ష్ కలిసి మరో 71 పరుగులు జోడించారు. పూరన్ అజేయంగా 87 రన్స్‌తో నాటౌట్‌గా నిలవడంతో లక్నో టీమ్ 20 ఓవర్లలో 238/3 స్కోరు చేసింది.

బౌలింగ్ విషయానికొస్తే.. KKR బౌలర్ హర్షిత్ రాణా 51 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఆండ్రీ రస్సెల్ 2 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. స్పెన్సర్ జాన్సన్ అయితే 3 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఒక్క వికెట్ కూడా తీయలేదు. నరైన్ 3 ఓవర్లలో 38 పరుగులు, చక్రవర్తి 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: