
బుమ్రా, బౌల్ట్ లాంటి స్టార్ పేసర్లను ఊచకోత కోశాడు. ఈ సీజన్లో ముంబైకి టాప్ వికెట్ టేకర్గా ఉన్న హార్దిక్ పాండ్యా బౌలింగ్లోనూ పరుగుల వరద పారించాడు. కరుణ్ మెరుపు ఇన్నింగ్స్తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అతని పాత పోస్ట్ వైరల్ అయింది. 2022లో కరుణ్ పెట్టిన పోస్ట్ అది "డియర్ క్రికెట్, గివ్ మీ వన్ మోర్ ఛాన్స్" అంటూ అప్పట్లో పోస్ట్ చేశాడు.
ఇంకోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. టీ20 క్రికెట్లో 100వ హాఫ్ సెంచరీ కొట్టి రికార్డు సృష్టించాడు. స్పిన్నర్ కర్ణ్ శర్మ 3 వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించాడు. దీంతో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఆదివారం నాడు అదిరిపోయే విజయాలు అందుకున్నాయి. జైపూర్లో రాజస్థాన్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది ఆర్సీబీ.
ఇక రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ థ్రిల్లర్కి కేరాఫ్ అడ్రస్లా సాగింది. ఢిల్లీ సొంతగడ్డపై ముంబై 12 పరుగుల తేడాతో గెలిచి ఢిల్లీ విజయాల పరంపరకు బ్రేక్ వేసింది. 206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ, కరుణ్ నాయర్ 89 పరుగుల వద్ద అవుటయ్యేసరికి 135/2తో పటిష్టంగానే కనిపించింది. కానీ ఆ తర్వాత లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ ఒక్కసారిగా ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. ఢిల్లీని 193 పరుగులకే ఆలౌట్ చేసి ముంబై విజయాన్ని లాగేసింది.
"ఇలాంటి మ్యాచ్లు గెలవడం ఎప్పుడూ స్పెషల్" అని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. "పోరాడుతూనే ఉండాలి. ఈ గెలుపు చాలా ఇంపార్టెంట్ మాకు" అంటూ మ్యాచ్ తర్వాత చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో వరుసగా నాలుగు విజయాల తర్వాత ఢిల్లీకి ఇదే తొలి ఓటమి. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబైకి ఇది ఆరో మ్యాచ్లో రెండో గెలుపు మాత్రమే.
చివరి 12 బంతుల్లో 23 పరుగులు కావాల్సిన దశలో అశుతోష్ శర్మ బుమ్రా వేసిన 19వ ఓవర్లో రెండు బౌండరీలు కొట్టి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేపాడు. కానీ ఆ ఓవర్లోని లాస్ట్ మూడు బంతుల్లో మూడు రనౌట్లు జరగడంతో సీన్ మారిపోయింది.
"ఫీల్డింగ్ ఒక్కోసారి గేమ్ టర్నర్ అవుతుంది అని నేను ఎప్పుడూ నమ్ముతా" అని పాండ్యా అన్నాడు. "మేము మ్యాచ్లో ఎక్కడా వదలకుండా పోరాడాం. దొరికిన ఛాన్స్లను క్యాచ్ చేసుకున్నాం. అమేజింగ్ ఫీలింగ్ ఇది" అంటూ మురిసిపోయాడు.
మూడేళ్ల తర్వాత ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ ప్లేయర్ కరుణ్ నాయర్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా, అతని టీమ్ ఓడిపోవడం మాత్రం ఫ్యాన్స్ను నిరాశపరిచింది. ఢిల్లీ 0-1తో ఉన్నప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కరుణ్, తొలి బంతికే జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చాడు. 2016లో ఇంగ్లాండ్పై టెస్టుల్లో 303 నాటౌట్ కొట్టిన కరుణ్, ఆ తర్వాత సెలెక్టర్ల దృష్టిలో పడకుండా పోయాడు.
ఏడేళ్ల తర్వాత ఐపీఎల్లో మళ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 22 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టి అభిషేక్ పోరెల్తో కలిసి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కర్ణ్, పోరెల్ను (33 పరుగులు) అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ కరుణ్ నాయర్ను అవుట్ చేయడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైపోయింది.