టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుక్రవారం వాంఖేడే స్టేడియం వెలుపల నిలబడి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు. విషయం ఏమిటంటే? ముంబై రంజీ ట్రోఫీ ఐకానిక్ వేదిక వద్ద అతని పేరు పెట్టబడిన ఒక స్టాండ్ చూసి అతను చాలా భాగోద్వేగానికి గురయ్యాడు. చెప్పలేని అనుభూతిని పొందానని చెప్పుకొచ్చాడు. ఎంసిఎ (ముంబై క్రికెట్ అసోసియేషన్) ఇటీవల వన్డే కెప్టెన్ రోహిత్‌తో పాటు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, మాజీ బిసిసిఐ అధ్యక్షుడు మరియు ఐసిసి చైర్మన్ శరద్ పవర్‌తో కలిసి ఒక స్టాండ్ పేరు పెట్టారు. టి 20 ముంబై లీగ్ యొక్క 3వ ఎడిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించిన తరువాత ఆనందించదగ్గ విషయం ఇదేనని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా రోహిత్... ముంబై రంజీ ట్రోఫీ టీం ప్రాక్టీస్ ప్రవేశించడానికి మునుపు, అంటే తనకి ఇష్టమైన టీమిండియా ప్లేయర్లను ఒక ప్రేక్షకుడిగా (ది) వాంఖేడ్ స్టేడియం వెలుపల నిలబడి చూసిన రోజులను గుర్తుచేసుకున్నాడు. రోహిత్ మాట్లాడుతూ... "నేను ఇపుడు 2004 లేదా 2003 గురించి మాట్లాడుతున్నాను. మేము ఆజాద్ మైదాన్ వద్ద మా U-14, U-16 శిక్షణను పూర్తి చేసాము. నేను, నా స్నేహితులలో కొంతమందితో, రైల్వే ట్రాక్ మీదుగా వెళ్ళడానికి మరియు రంజీ ట్రోఫీ క్రికెటర్లలో కొంతమందిని చూసేందుకు ఇక్కడే ఇదే స్టేడియం వెలుపల చాలా ఎదురుచూసాము." అని అన్నారు.

ఇంకా రోహిత్ మాట్లాడుతూ... అప్పటికి వాంఖేడ్ స్టేడియం లోపలికి మేము ప్రవేశించడం అంటే అది చాలా కష్టం మాకు... అయితే ఇప్పుడు ఏకంగా స్టేడియం లోపల మేము ఆడుతుండడం అదృష్టంగా భావిస్తున్నా! అని అన్నారు. ఇకపోతే వాంఖడే స్టేడియంలోని డివిచా పెవిలియన్ యొక్క 3వ స్టాండుకి రోహిత్ పేరు పెట్టబడింది. అతను టి 20 ప్రపంచ కప్ 2024 లో మరియు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దేశానికి టైటిల్స్ అందించాడు. ఇక అప్పట్లో వాంఖేడ్ స్టేడియం లోపలికి అందరినీ రానిచ్చేవారు కాదట. ఇపుడు అదే వాంఖేడ్ స్టేడియంలో తన పేరిట స్టాండ్ అనేసరికి రోహిత్ ఒకింత ఎమోషనల్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: