బుల్లితెరపై ప్రసారమవుతున్న ధారావాహికలలో ఎంతో మంది నటీ నటుల రియల్  పేర్లు చాలా మందికి తెలియదు. అందుకే ఆ  పేరుతోనే వారిని బయట కూడా ప్రేక్షకులు పిలుస్తూ ఉంటారు. ఇందుకు కారణం వారు చేసే పాత్ర అని చెప్పవచ్చు. వారు చేసే పాత్రలో లీనమైపోయి మరీ  ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి ఆ పేర్లే  రియల్ లైఫ్ లో కూడా పేరు పడిపోయాయి. ఇదిలా ఉండగా ఎంతో మంది బుల్లితెరపై నటించి, అక్కడ స్టార్ స్టేటస్ ను పొం,ది ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. కానీ మరికొంతమంది మాత్రం సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అక్కడ సరిగ్గా ప్రేక్షకులను మెప్పించలేక తిరిగి బుల్లితెరపై తమ హవాను కొనసాగిస్తున్నారు. ఇక అలాంటి వారిలో ఒకరు త్రినయని  సీరియల్ విలన్ జాస్మిన్ కూడా.
ఇటీవల జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ముఖ్యంగా నటీనటులు  ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఇక హీరో, హీరోయిన్ ఈ సీరియల్ కు  ఎంత  హైప్ తీసుకువచ్చి పెడుతున్నారో,  ఇక అంతే స్థాయిలో నెగెటివ్ రోల్ లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదిస్తున్నారు ఈ  సీరియల్ విలన్ జాస్మిన్ కూడా.

ఈమె అసలు పేరు ప్రియాంక శర్మ. ఈమె మన తెలుగమ్మాయి. నవంబర్ 4వ తేదీన విజయవాడలో  జన్మించింది . ఇక తన ప్రాథమిక విద్య మొత్తం విజయవాడలోనే ముగియగా, ఇక డిగ్రీ మాత్రం హైదరాబాద్లో పూర్తి చేసింది. ముఖ్యంగా ఈమెకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టమట. ఇక ఇదంతా పక్కన పెడితే సహజంగా చూడడానికి అందంగా ఉండడంతో ఈమెకు స్కూల్ డేస్ నుంచే టీచర్స్ అలాగే స్నేహితులు సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళమని   ప్రోత్సహిస్తూ ఉండేవారట. ఇక వారి ప్రోత్సాహమే  ప్రియాంకలో కూడా ఒక ఆలోచన వచ్చేలా చేసింది. అయితే మొదటి సినీ ఇండస్ట్రీ లోకి వెళ్ళడానికి ఈమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదట.

కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈమె తల్లి ఎంకరేజ్ చేయడంతో, మొదట సినీ ఇండస్ట్రీలోకి మన ఊరిలో మన ప్రేమాయణం, శివకాశిపురి వంటి చిత్రాల ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత సీరియల్స్ లో నటించే అవకాశం రావడంతో ఈ టీవీలో ప్రసారం అవుతున్న అభిషేకం సీరియల్ ద్వారా బుల్లి తెరపై అడుగుపెట్టి, అక్కడ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక అంతేకాదు రోజా అలాగే రెండు రెళ్ళ ఆరు  వంటి సీరియల్స్ లో  కూడా ఈమె నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: