
ఇక ఈమె పేరు షీలా సింగ్.. భర్త పేరు కళ్యాణ్ కాగా ఆయన క్లాత్ బిజినెస్ చేస్తారు. ఇక ఈ దంపతులకు ఒక బాబు కూడా జన్మించారు. అబ్బాయి పేరు ఇషాంత్. వరంగల్ జిల్లా డోర్నకల్ లో జన్మించింది.. ఇక ఈమె తల్లి తెలంగాణ అయినప్పటికీ తండ్రిది మాత్రం ఉత్తర ప్రదేశ్. ముగ్గురు అన్నయ్యలు, ఒక అక్క ఉన్నారు. అయితే పదో తరగతి చదువుతున్నప్పుడు ఒక సినిమాలో అవకాశం రావడంతో పదవ తరగతి వరకు చదివి ఆ తరువాత సినీ ఇండస్ట్రీ లోకి వచ్చేసింది.
చంటి గాడు , ధైర్యం, నీ మనసు నాకు తెలుసు వంటి సినిమాలలో నటించిన షీలా ఆ తర్వాత ప్రియాంక సీరియల్ ద్వారా బుల్లితెర పై అడుగుపెట్టింది. బొమ్మరిల్లు, మధువాణి, కన్యాదానం, సావిత్రమ్మ గారి అబ్బాయి మా ఆడపడుచు,నిన్నే పెళ్లాడతా, మొగలి రేకులు, మట్టిగాజులు వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న షీలా ప్రస్తుతం శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ లో తల్లి పాత్రలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సీరియల్స్ ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది షీలా.. ఏది ఏమైనా ఈమె నటనను ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు సైతం మెచ్చుకోవడం గమనార్హం.