యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే తన భర్తతో గత నాలుగు ఐదు రోజులుగా సరసాలు, హగ్ , బీచ్ లో ఆటలు ఇలా రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ మరింత హాట్ టాపిక్ గా మారింది. వివాహం అనంతరం ఫైనల్ టచ్ గా ఒక వీడియో షేర్ చేసిన ఈమె అందరికళ్ళు నా పైనే అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఇటీవల భర్తతో థాయిలాండ్ విహార యాత్ర ముగించుకొని హైదరాబాద్ కి చేరుకున్న ఈమె తన తాజా చిత్రం విమానం ప్రమోషన్స్ లో బిజీ అయింది. ఇకపోతే విహారయాత్ర అనంతరం ఫైనల్ టచ్ గా ఒక వీడియో షేర్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కోసం వెళ్ళిన అనసూయ అక్కడ బికినీ ధరించి హద్దులు మీరి మరీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసి నెటిజన్స్ విపరీతంగా అనసూయను ట్రోల్ చేశారు. అంతేకాదు ఆమెను అభిమానించే వారు కూడా ఆమెను ట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా పెళ్లిరోజు అనేది నీ వ్యక్తిగత విషయం కదా మీ ఎంజాయ్మెంట్లో ఫోటోలు రూపంలో ఇలా బయట పెట్టడం మంచిది కాదేమో అంటూ మరికొంతమంది సలహా కూడా ఇచ్చారు. కొందరైతే అనసూయ గ్లామర్ లో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని హద్దులు మీరి మరి కామెంట్లు చేశారు.

అందుకే అందరి కళ్ళు నా పైనే అంటూ కామెంట్ చేసింది.ఇకపోతే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి.. అనసూయకు మధ్య జరుగుతున్న గొడవకి ఆమె పులిస్టాప్ పెట్టేశారు. కావాలని పెయిడ్ ట్రోలర్స్ తనపై దాడి చేస్తున్నారు అని.. అలా ఎవరు చేయిస్తున్నారో కూడా తనకు తెలుసు అని.. ఒక మహిళను ఇంతగా అవమానిస్తారా అంటూ కోపంతో కూడిన బాధ వచ్చింది. అందుకే మానసిక ప్రశాంతత కోసం ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలనుకుంటున్నాను.. చాలాసార్లు ఈ విషయంపై విజయ్ తో మాట్లాడాలని చూసినా కుదరలేదు.. పూర్తిగా అలసిపోయాను అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: