ప్రముఖ బుల్లితెర గ్లామర్ బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ఎనలేని క్రేజ్ దక్కించుకున్న ఈమె ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తో కలిసి షోలో ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదని చెప్పాలి. ముఖ్యంగా వెండితెర పైన కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ సందడి చేసే ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించి గుర్తింపు దక్కించుకుంది. కానీ స్టార్ స్టేటస్ మాత్రం పొందలేకపోయింది. దాంతో హీరోయిన్ అవ్వడానికి ఏవేవో చేసింది కానీ ఏవి కూడా ఆమెకు స్టార్ హీరోయిన్ పొజిషన్ ను అంటగట్టలేదు.

ఇదిలా ఉండగా బయట కూడా రష్మీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇటీవల జ్యువెలరీ షాప్ లో ఏకంగా రూ.6 లక్షల బంగారం కొనుగోలు చేస్తే ఆ బిల్లుని ఒక రాజకీయ నాయకుడు కట్టారు అని సమాచారం అందుతుంది. అంతేకాకుండా యాడ్ చేసినందుకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అడిగిందట ఈ ముద్దుగుమ్మ.  ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. సాధారణంగా సెలబ్రిటీలు షాపింగ్ మాల్స్, జువెలరీ షాపుల ఓపెనింగ్ కి వెళ్లడం చాలా సహజం. అలా వెళ్తే ఆ షాపు వాళ్ళు ఎంతో కొంత వాళ్లకి గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు.  ఇప్పుడు రష్మీ విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందని అభిమానులు అంటున్నారు.

మరొకవైపు రష్మీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లు అవుతున్నా..  ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు.  ఇంకొక వైపు సుధీర్ కూడా పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక ఎప్పటినుంచో అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నా.. స్క్రీన్ పై బ్యూటిఫుల్ కపుల్ గా పేరు దక్కించుకున్న వీరు మాత్రం రియల్ లైఫ్ లో  ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మరి రియల్ లైఫ్ లో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: