అయితే ఇందులో ఫినాలి పోటీలలో అర్జున్ అంబాటి ఆరవ స్థానం ప్రియాంక జైన్ ఐదవ స్థానం.. ప్రిన్స్ యావర్ 15 లక్షల తీసుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో పల్లవి ప్రశాంత్, అమర్దీప్, శివాజీ ముగ్గురు కూడా టైటిల్ కోసం నిలిచారు.. చాలామంది శివాజీని ఏడో సీజన్ బిగ్ బాస్ విన్నర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఉల్టా ఫాల్తా మారిపోయింది.శివాజీ మూడో ప్లేసులో సరి పెట్టుకోగా అమర్దీప్ రన్నర్ గా నిలవగా రైతుబిడ్డ ప్రశాంత్ సెవెన్ విన్నర్ గా నిలిచారు.
ఈ బిగ్ బాస్ ని సామాన్యులే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి కూడా బిగ్ బాస్ షో ని ఫాలో అవుతానని ఆయన భార్య కూడా అవుతుందని తెలిపారు. చిరంజీవి దంపతులకు ఇష్టమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో అని అడగగా . వారికి నటుడు శివాజీనే అని ఈ విషయాన్ని స్వయంగా శివాజీని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. నేను నటించిన సైంటిస్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనేందుకు వెళ్లగా అక్కడ చిరంజీవి గారు కనిపించి వెళ్ళగా ఆయన పలకరిస్తూ అప్పుడు తనతో ఈ విషయాన్ని చెప్పారని తెలిపారు శివాజీ.