ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కువగా వినిపిస్తున్న పేరు గాయత్రి గుప్తా.. ఈ అమ్మడి పేరు వినగానే చాలామందికి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలిగా నటించింది గాయత్రి గుప్తా.. తాజాగా ఇండస్ట్రీలో జరిగేటువంటి క్యాస్టింగ్ కౌచ్ పైన ఇటీవలే షాకింగ్ విషయాలు తెలియజేసింది. గతంలో కూడా ఈ అమ్మడు క్యాస్టింగ్  కౌచ్ పైన పలు రకాల ఆరోపణలు తెలియజేసింది. ఆఫర్స్ కోసం చాలామంది హీరోయిన్స్ కమిట్మెంట్ ఇస్తారంటు బాంబు పేల్చింది.


ఇటీవల రెండు రోజుల క్రితం బేబీ సినిమా కాఫీ అంటూ తెలియజేసింది. బిగ్బాస్ గేమ్ షో పైన మరొక సారి ఇప్పుడు తాజాగా పలు కామెంట్స్ చేసింది గాయత్రి గుప్తా.. గతంలో గాయత్రి గుప్తాకు బిగ్ బాస్ ఆఫర్లో వచ్చింది. కానీ కొన్ని విభేదాల కారణంగా ఆమె ఆ శివకి మాత్రం వెళ్లలేదట. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మరొకసారి బిగ్ బాస్ షో పైన పలు విషయాలను వెల్లడించింది.. బిగ్బాస్ షో కి వెళ్లాలంటే ముందుగా కాంట్రాక్టు పైన సంతకం చేయాలని తెలియజేసింది. అయితే అందులో చాలా రూల్స్ ఉంటాయి.


ఇందులో బిగ్ బాస్ కు ఓకే అయిన తర్వాత సినిమాలు అసలు ఒప్పుకోకూడదని ఈ కారణంతోనే తాను 15 సినిమాలను వదిలేయాల్సి వచ్చిందంటూ తెలిపింది. అయితే ఏమైందో ఏమో కానీ తనని సడన్గా బిగ్ బాస్ నుంచి తీసేసారని తెలియజేసింది. దీంతో చాలా నష్టం జరిగిందని కోర్టు వరకు కూడా వెళ్లానని తెలిపింది. అయితే ఆడిషన్స్ పేరుతో అమ్మాయిలను మాత్రం హోటల్స్ కి తీసుకువెళ్తారు అంటూ బాంబు పేల్చింది. అలాగే నాగార్జున గారి పైన షో పైన తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని కేవలం నిర్వాహకుల మిద మాత్రమే తాను పోరాడుతానని తెలియజేసింది గాయత్రి గుప్తా. అలా కోర్టు మెట్లు ఎక్కడంతో రూల్స్ కూడా మారిపోయాయని.. తనకి కూడా నష్టపరిహారం అందిస్తున్నారని ఈ విషయాన్ని తెలియజేసింది గాయత్రి గుప్తా.

మరింత సమాచారం తెలుసుకోండి: