గత కొంతకాలంగా జానీ మాస్టర్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నది వివాదాల కారణంగా. ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని. ప్రముఖ డాన్సర్ సతీష్ గతంలో జానీ మాస్టర్ గురించి పలు సంచలన ఆరోపణలు సైతం చేయడం జరిగింది. ఈ ఆరోపణల గురించి జానీ మాస్టర్ కూడా మాట్లాడారు. అయితే దీంతో ఈ వివాదం ముగిసింది అనుకుంటున్న సమయంలోనే ఇప్పుడు మరొకసారి ఈ వివాదానికి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జానీ మాస్టర్ కు డబ్బు పరపతి అన్ని ఉన్నాయి అన్నం పెట్టిన వ్యక్తికి సున్నం చేశారని ప్రముఖ డాన్స్ మాస్టర్ సతీష్ తెలిపారు.


జానీ మాస్టర్ తన దగ్గర ఒకప్పుడు సహాయంగా డబ్బులు తీసుకున్నారని.. జానీ మాస్టర్ తండ్రి మరణిస్తే 30 వేల రూపాయలు ఇచ్చానని సతీష్ వెల్లడించారు. అంతటి సహాయం చేసిన తనకి విశ్వాసం కూడా లేదని తెలిపారు.. అలాగే తనకు బైక్ లేకపోతే బైక్ ఇచ్చానని.. జానీ మాస్టర్ ఏదైనా సినిమాలో ఒక సాంగ్ చేశారంటే మళ్ళీ మరొక సాంగ్ రావడానికి కనీసం 6 నెలలు సమయమైన పట్టేది.. మిగిలిన డ్యాన్స్ మాస్టర్లు కనీసం నెలలో రెండు మూడు సాంగ్స్ అయినా చేస్తూ ఉండేవారని తెలిపారు సతీష్. జానీ మాస్టర్ మరి ఎలా సంపాదిస్తారు అంటూ ఆయన ప్రశ్నించారు.


జానీ మాస్టర్ రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది అని తెలిపారు. జానీ మాస్టర్ కు ఇతర భాషలలో కూడా బాగానే గుర్తింపు ఉన్నది. జానీ మాస్టర్ ఎప్పుడూ కూడా వివాదాలకు సైతం దూరంగానే ఉంటారు. కానీ ఇలాంటి వివాదాలలో చిక్కుకోవడం వల్ల తన కెరీర్ కు ఇబ్బంది అవుతుందని పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు. మరి డాన్స్ మాస్టర్ అయిన సతీష్ ని జానీ మాస్టర్ సామాన్య పూర్వకంగానే కలిసి సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని అభిమానులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: