బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో పల్లవి ప్రశాంత్ కూడా ఒకరు.. ఈ షో షూటింగ్ సమయంలో బిగ్బాస్ షో విజేతగా నిలిస్తే ఖచ్చితంగా ఆ డబ్బు ద్వారా చాలామంది రైతులకు మేలు చేస్తానని తెలియజేశారు. అన్నట్టుగానే షో విన్నర్గా నిలిచారు పల్లవి ప్రశాంత్.. కానీ తను మాత్రం రైతులకు ఎలాంటి సహాయం చేయకుండా ఎంజాయ్ చేస్తున్నాడు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రముఖ యూట్యూబర్ యువసామ్రాట్ రవి పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడడం జరిగింది.


రైతు బిడ్డ యాడున్నావ్ ఆ పైసలు ఎక్కడ అంటూ యువ సామ్రాట్ రవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. తనకు కూడా బిగ్ బాస్ షో కి వెళ్ళాలని ఉంది కానీ బిగ్ బాస్-7 చూసిన తర్వాత అషోకు వెళ్లాలని ఆసక్తి కూడా పోయింది అంటూ తెలియజేశారు.. బిగ్బాస్ -7 లో ఒక పెద్ద డ్రామా నడిచింది. ఇది ఎవరు గమనించలేకపోయారు రైతు బిడ్డ పేరుతో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఒక సింపతి డ్రామాని సృష్టించారు అంటూ యువ సామ్రాట్ రవి తెలియజేశారు.


తాను రైతుబిడ్డ అని విజేతగా నిలిస్తే ప్రైజ్ మనీ మొత్తం రైతులకి ఇచ్చేస్తానని చెప్పిన ఆయన ఎన్ని డ్రామాలు ఆడి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి చివరికి ప్రైజ్ మనీ తో ఎక్కడో పోయి ఎంజాయ్ చేస్తున్నారని కారు కూడా కొన్నాడని తెలియజేశారు రవి. రైతుబిడ్డ కారు కొనవచ్చు కానీ అందులో ఏమాత్రం తప్పులేదు.అయితే రైతుల పేరు చెప్పుకొని కాదు అని తెలియజేశారు. రైతులకు ఇస్తానని చెప్పిన డబ్బులు ఇవ్వాలి కదా అంటూ తెలియజేశారు.. పల్లవి ప్రశాంత్ కన్నిగ్ డ్రామాలు చూసిన తర్వాత హౌస్ లోకి వెళ్ళాలనిపించలేదంటూ తెలియజేశారు. ప్రస్తుతం యువ సామ్రాట్ రవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: