ఇక హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రీ ఇస్తున్నారనేది కూడా పలువురి పేర్లు నెట్టింట వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి సురేఖ వాణి, సోనియాసింగ్, నటి హేమ, యూట్యూబ్ బంచిక్ బబ్లూ, బర్రెల అక్క, కుమారి ఆంటీ, అమృత వర్షిణి, రీతు చౌదరి, కిర్రాక్ ఆర్పి, బుల్లెట్ భాస్కర్...ఇలా తదితరులు బిగ్ బాస్ సీజన్-8 లో పార్టిసిపెంట్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే సీజన్-8 కోసం నాగార్జున ఎంత పారితోషకం తీసుకుంటున్నారనేది బయటపడింది.
బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం..నాగార్జున 25 కోట్ల రూపాయలు తీసుకున్నారట. దీనితో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే బిగ్ బాస్ సెట్ కు అద్దె కూడా అందుతుందట. కాదా మొత్తం కలిపి కింగ్ నాగార్జునకు 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోనన్నారట. బిగ్ బాస్ సీజన్-7 లో అద్భుతంగా పార్టిసిపెంట్స్ పాల్గొని బిగ్ బాస్ ను మంచి రేంజ్ కు తీసుకెళ్లింది. ఇప్పుడు సీజన్-8 ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్-8 త్వరలోనే రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మునుపటి దానికన్నా బాగుంటుందో లేదో చూడాలి.