తెలుగు బుల్లితెరపై అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమె యాంకర్ గా ఎంత సక్సెస్ సాధించిందో యాక్టర్ గా కూడా అంతే సక్సెస్ ని అందుకుంది. అనసూయ ఏదైనా పాత్ర చేస్తోందంటే చాలు ఆ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే తప్ప చేయదు అనే అంతలా పాపులారిటీ సంపాదించుకుంది. త్వరలోనే అనసూయ నటించిన సింబా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా తాజాగా ట్రైలర్ ని కూడా విడుదల చేయడం జరిగింది చిత్రబృందం.. అలాగే ఈ ట్రైలర్ ఈవెంట్ లో కూడా విజయ్ దేవరకొండ గురించి రూల్స్ పైన కూడా మాట్లాడడం జరిగింది.



ఇదంతా ఇలా ఉండగా అనసూయ గురించి ఒక అభిమాని సోషల్ మీడియాలో ఇలా షేర్ చేస్తూ లైఫ్ లో అనసూయని రెండోసారి కూడా చూశాను అది చాలు అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు.. ఈ ట్వీట్ కు అనసూయ స్పందిస్తూ అయ్యో మరి నన్ను కలవచ్చు కదా అని అనడంతో చాలా ట్రై చేశాను కానీ మీరు చాలా ఓపికగా మీడియా వారు అడిగే ప్రశ్నలకు సైతం ఆన్సర్ చెబుతున్నారు అంటూ తెలిపారు. ఏది ఏమైనా మిమ్మల్ని చూశాను చాలు అంటూ తెలిపింది అనసూయ.


కానీ ఈసారి వస్తే మాత్రం దయచేసి మీరు నన్ను కూడా కలవండి ఏం జరిగినా పరవాలేదు నన్ను కలవండి అంటూ తెలిపింది అనసూయ. అయితే ప్రముఖ సింగర్ గా పేరు పొందిన చిన్మయి అనసూయ గురించి పేరు ఎత్తకుండా ఒక పిల్లాడితో ముద్దులు పెట్టించుకోవడం లిప్స్ మీద కూడా పెట్టించుకోవడం వంటి వాటిపైన ఘాటు గాని స్పందించి ట్రోల్ కూడా చేసింది. అసలు ఈ షోకు పిల్లలను ఎందుకు తీసుకువస్తారు. వినోదం పేరిట పిల్లలతో చాలా దారుణంగా షోలు చేస్తున్నారు.. ఇది ఫన్ కాదు కానీ అబ్యూజ్ అవుతుంది అంటూ ఆమె కాటుగా స్పందించింది.



అయితే తాజాగా అనసూయ లైవ్ లోకి వచ్చి మరి క్లారిటీ ఇచ్చింది.. షోలు ఉన్నది ఎంటర్టైన్మెంట్ కోసమే.. కేవలం దానిని ఎంటర్టైన్మెంట్ లాగే చూడాలి వారికి తోచిన ధోరణిలో చూస్తే అది అలా అనిపిస్తుంది అంటూ అనసూయ క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేవలం పిల్లలతో అయినప్పుడు వారికి కావలసిన కార్టూన్ చానల్స్ మాత్రమే చూపించండి అంటూ అనసూయ కౌంటర్ వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: