తెలుగులో బిగ్ బాస్-8 సీజన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.. ఇప్పటికి ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది బిగ్ బాస్. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభ కాబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే కంట్రీట్లకు సంబంధించి వార్తలు రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిలో యాంకర్ విష్ణుప్రియ, రీతు చౌదరి కూడా ఉన్నారనే విధంగా వార్తలు వినిపించాయి. వాస్తవానికి వీరిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పవచ్చు.ఎక్కడికి వెళ్లినా కూడా కలిసే వెళ్తూ ఉంటారు.



అలా ఎన్నో రకాల ఫోటోలను కూడా ఇప్పటికే షేర్ చేశారు ఈ ముద్దుగుమ్మలు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఉంటారు. అయితే వీరిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరికి బిగ్ బాస్ కార్యక్రమం పైన ప్రశ్నలు ఎదురవ్వగా.. ఈ విషయం పైన యాంకర్ విష్ణు ప్రియ మాట్లాడుతూ.. అలాంటి అవకాశం వస్తే నేను హౌస్ లోకి వెళ్లి పది కేజీలు బరువు తగ్గుతానంటూ తెలియజేసింది.


చాలా మంది బరువు తగ్గడానికి హౌస్ లోకి వెళ్లాలనుకుంటారని తెలిపింది. ఒక వేళ ప్రేక్షకుల ఆదరణ ఆ దేవుడు ఆశీస్సులు ఉంటే కచ్చితంగా బిగ్ బాస్ కార్యక్రమంలో కనిపిస్తామంటూ ఆమె పరోక్షంగా తెలియజేసింది. జబర్దస్త్  లేడి యాక్టర్, యాంకర్ రీతు చౌదరి కూడా ఇదే ఆన్సర్ని చెప్పడంతో వీరిద్దరూ హౌస్ లో సందడి  చేయబోతున్నారనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.. మొత్తానికి అభిమానుల మీద వీరి బిగ్ బాస్ ఎంట్రీ డిపెండ్ అయ్యిందని చెప్పవచ్చు. మరి ఏ మేరకు అభిమానులు కూడా వీరి కోరికను నెరవేరుస్తారు చూడాలి మరి. మరి గత సీజన్లో కంటే ఈ సీజన్ తో బిగ్ బాస్ మరింత పాపులారిటీ అయ్యేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: