బిగ్ బాస్ లో ఎన్నో నటీనటులు పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ లో నాగార్జున పోస్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక బిగ్ బాస్ రివ్యూవర్ గా కెరియర్ ప్రారంభించి..అదే బిగ్ బాస్ షోకి వెళ్లి తన సత్తా చాటిన ఆదిరెడ్డి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటిస్టెంట్ గా అడుగుపెట్టాడు. అలా అక్కడ తన గేమ్స్ తో టాప్ 5 కంటిస్టెంట్ గా నిలిచి ఆడియన్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ, విన్నర్ మాత్రం కాలేకపోయాడు. ఇక బయటకి వచ్చిన తరువాత కూడా తన రివ్యూవర్ రోల్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కి సంబంధించి వరుస వీడియోలు , అనాల్సిస్ తో తన ఫాలోవర్స్ ని అలరించాడు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వీడియోలు కూడా మొదలు పెట్టాడు.


అందులో భాగంగా ఆది రెడ్డి కొన్ని కీలక విషయాలను ఒక వీడియోగా చేసి పోస్ట్ చేశాడు. అందులో భాగంగా బిగ్ బాస్ పేరిట జరిగే మోసాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఎవరు కూడా అలాంటి ట్రాప్ లో పడొద్దు అంటూ సూచించాడు. ఆ వీడియోలు..తనకు బిగ్ బాస్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేసి...మీకు బిగ్ బాస్ కి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగారట. తనకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన తర్వాత అధికారిక వెబ్ సైట్ నుంచి మెయిల్ పంపి కొన్ని వివరాలు తెలిపారు. ఆ తర్వాత అతనికి జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరిగిన విషయాన్ని చెప్పాడు. తర్వాత రెమ్యూనిరేషన్ వివరాలు చర్చించడం, హైల్త్ చెకప్స్, తర్వాత మెయిన్ ఇంటర్వ్యూలో కూడా జరిగిందట. ఏవీలు, డ్యాన్స్ షూట్స్ అన్నీ ఆయన తర్వాత హౌస్ లోకి పంపుతారు. అలాగే తికమండేషన్ తో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లటం అసాధ్యం అనే విషయాన్ని స్పష్టం చేశాడు. అలాగే ఎవరైనా మీకు బిగ్ బాస్ హౌస్ కి పంపుతాను అని డబ్బులు అడిగినా కూడా ఆ ట్రాప్ లో పడకండి అని సూచించాడు.


ఆఫర్ ఇచ్చే పనైతే వాళ్లే కాల్ చేసి..అధికారిక మెయిల్ ఐడి నుంచి మెయిల్ చేశారని చెప్పుకొచ్చాడు. కాగా తనకు బిగ్ బాస్ సీజన్ 6 ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు రెమ్యూనిరేషన్ అందినట్లు ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసి..అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసింది..ప్రోమో ను బట్టి చూస్తే..ఈసారి కూడా దాదాపుగా సెప్టెంబర్ నెలలోనే స్టార్ట్ అవుతుంది అనే విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ వార్త నిన్నటింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: