బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే బిగ్ బాస్ షో త్వరలోనే రాబోతోంది. ఇప్పటివరకు ఏడు సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ షో కి సంబంధించి ప్రోమో కూడా విడుదల కావడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో ఆవరణంలోనే బిగ్ బాస్ సెట్ వర్కింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కంటిస్టన్ల ఎంపిక కూడా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలోనే బిగ్ బాస్ పేరిట జరిగేటటువంటి మోసాల గురించి ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి తెలియజేశారు. వాటి గురించి చూద్దాం.

ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ పేరిట గతంలో జరిగిన కొన్ని మోసాలను కూడా తెలియజేశారు. హౌస్ లోకి పంపిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే వారి చేతిలో మోసపోకూడదు అని తెలుపుతున్నారు. ఆదిరెడ్డి తనకు బిగ్ బాస్ హౌస్ లో తనకు కేవలం 25 లక్షల నుంచి 30 లక్షల వరకు పారితోషకం వచ్చిందని వెల్లడించారు.. తనకు బిగ్ బాస్ హౌస్ కు సంబంధించిన ఒక వ్యక్తి ఫోన్ చేశారు. మీరు బిగ్బాస్ రావడానికి ఆసక్తిగా ఉన్నారా లేదా అని అడుగుతారు తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాకే అధికారిక వెబ్సైట్ నుంచి ఒక మెయిల్ పంపుతారు అందులో మన వివరాలను అడిగిమరి ఫిల్ అప్ చేసుకుంటారు. ఆ తర్వాతే జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరుగుతుంది అంటు తెలియజేశారు.


అక్కడే మనం రెమ్యూనరేషన్ వివరాలను కూడా మాట్లాడుకోవాలి అలాగే హెల్త్ చెకప్ తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది.. ఏ వీలు, డాన్స్ సూట్ అన్ని కూడా జరిగిన తరువాతే హౌస్ లోకి పంపిస్తారంటూ తెలిపారు. రికమండేషన్ ద్వారా ఎవరైనా హౌస్ లోకి వెళ్లాలనుకుంటే అది అసాధ్యమని కూడా తెలిపారు. అందుకు సంబంధించి వీడియోను కూడా పోస్ట్ షేర్ చేశారు ఆదిరెడ్డి. ఎవరు కూడా ఎలాంటి విషయాలను  నమ్మవద్దండి అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: