తెలుగు బుల్లితెరపై సీరియల్స్ లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని పేరు నటి ప్రేమి విశ్వనాథ్.. అలియాస్ వంటలక్క.. ఈ పేరు వింటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ గుర్తుకువస్తుంది. ఈ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె పలు చిత్రాలలో కూడా నటించింది. వాస్తవానికి ప్రేమే విశ్వనాధ్ కేరళ రాష్ట్రానికి చెందినటువంటి నటి అయినప్పటికీ కూడా తెలుగులో మంచి పాపులర్టే అందుకున్నది. ఇటీవలే కార్తీకదీపం సీక్వెల్ గా నవవసంతం అనే పేరుతో కొత్త ధారావాహికలు మొదలుపెట్టారు.


ఈ సీరియల్ కూడా బాగానే పాపులారిటీ అందుకుంది. అయితే నటి ప్రేమి విశ్వనాథ్ గురించి చాలా మందికి కొన్ని విషయాలు తెలియవు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రేమి విశ్వనాథ్ మాట్లాడుతూ తన భర్త గురించి తెలుపుతూ.. తెలుగులో అవకాశం రావడంతో తన భర్తను పిల్లలను సైతం వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చిందని.. బిజీ షెడ్యూల్ కారణంగా తన భర్తను దూరం పెట్టాల్సి వచ్చింది అంటూ తెలిపింది. తన భర్త కూడా వ్యాపార రంగంలో బిజీగా ఉండడం వల్ల తను కూడా దూరంగా ఉండాల్సి వచ్చిందంటూ తెలిపింది.


కేరళలో ఉన్నప్పుడు తన భర్త వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ తనను కూడా తీసుకొని వెళ్లేవారు లేకపోతే రెండు రోజులకు ఒకసారైనా వచ్చేవారని తెలిపింది వంటలక్క. కానీ ఇప్పుడు  ఇద్దరు కూడా తమ లైఫ్ లో బిజీగా ఉండడం వల్ల అసలు కలిసి ఉండడం కుదరలేదని ఎప్పుడో ఒకసారి మాత్రమే కలవడానికి కుదురుతోంది అంటూ వెల్లడించింది ప్రేమ విశ్వనాథ్. కొన్ని సందర్భాలలో చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నామని.. ప్రస్తుతం అయితే హ్యాపీగా ఉన్నామని కానీ గడిచిపోయిన జీవితాన్ని తలుచుకుంటే ఎన్నోసార్లు బాధపడవలసి ఉంటుంది అంటూ తెలిపింది వంటలక్క. తెలుగు ప్రేక్షకులు తనని ఇంతగా ఆదరిస్తారని ఎప్పుడూ అనుకోలేదని.. అందుకే ఎప్పటికీ ప్రేక్షకులను మర్చిపోలేనట్టు తెలియజేసింది ప్రేమీ విశ్వనాథం.

మరింత సమాచారం తెలుసుకోండి: