తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా పేరుపొందిన వాటిలో స్టార్ మా కూడా ఒకటి.. ఇందులో ప్రసారమయ్యేటువంటి సీరియల్స్ కు మంచి పాపులారిటీ ఉన్నది. అలాంటి సీరియల్స్ లో మౌనరాగం సీరియల్ కూడా ఒకటి. అయితే ఈ సీరియల్ హీరోయిన్ గా నటించిన అమ్ములు పాత్రకి మంచి క్రేజ్ ఉంది. అమ్ములుకు సంబంధించి ఈ విషయాలు తెలియవు. ఈమె అసలు పేరు ప్రియాంక జైన్ ఈమె ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ తన విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తి చేసుకున్నదట. కానీ సినిమాల మీద మక్కువ ఉండడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.


అలా మొదటిసారి చల్తే చల్తే అని సినిమా ఆడిషన్ కి పాల్గొన్నప్పుడు ఈమె హీరోయిన్గా అవకాశాన్ని సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రదీప్ కుమార్ దర్శకత్వం వహించారట. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఈ అమ్మడికి సరైన గుర్తింపు మాత్రం లభించింది. ఆ తర్వాత తెలుగులో ఎవడు తక్కువ కాదు, వినరా సోదర వీర కుమార చిత్రంతో పాటు తమిళంలో కూడా గోలి సోడా అనే సినిమాలో నటించిందట. అయితే ఈ చిత్రాలన్నీ కూడా ఈమెకు డిజాస్టర్లు గానే మిగిలిపోయాయి.


దీంతో ప్రియాంక జైన్ చేసేదేమీ లేక మౌనరాగం సీరియల్ హీరోయిన్ గా నటించింది. ఈమె ఈ సీరియల్ లో మూగ అమ్మాయి క్యారెక్టర్లో నటించినప్పటికీ తన అందంతో అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అయితే ఇలాంటి పాత్రకు కూడా ఆడియన్స్ ఉంటారా అనేంతగా  జీవించి మరి నటించింది ప్రియాంక జైన్ .. అందుకే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.ప్రస్తుతం ఇతర సీరియల్స్ లో కూడా నటిస్తూనే మరొకపక్క సినిమా అవకాశాలలో నటించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.  ప్రియాంక జైన్ మరి రాబోయే రోజుల్లో తను అనుకున్నట్టుగానే హీరోయిన్గా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: