సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నాచురల్ స్టార్ నాని హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొని, తన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది . బిగ్ బాస్ లో తన ఆటతో పాటు అందంతో కూడా ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్న ఈమె టాస్క్ లో భాగంగా జుట్టు కూడా కత్తిరించుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

నిజానికి ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు.  కానీ ఏమాత్రం అలా జరగలేదు. నిఖిల్ హీరోగా నటించిన కిర్రాక్ పార్టీ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకరకాల ఫోటోషూట్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.  ముఖ్యంగా హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటున్న ఈమె గతంలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇద్దరు కలిసి చాలా వెబ్ సిరీస్ లో సాంగ్స్ కూడా చేశారు. ప్రేమలో ఉన్నప్పుడే అతని పేరులోని అక్షరాన్ని టాటూ కూడా వేయించుకుంది.  కానీ బ్రేకప్ తర్వాత టాటూ కవర్ చేసుకుంది దీప్తి సునయన.

ఇకపోతే సోషల్ మీడియాలో ఎక్కువ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఏది షేర్ చేసినా జెట్ స్పీడులో అది వైరల్ అవుతుంది. తాజాగా ఈమే గోవా వెళ్ళగా అక్కడి నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అందులో కన్నీళ్లు పెట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  కళ్ళు మూసుకొని దీప్తి ఏడుస్తున్న ఫోటో చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఏమైంది ఎందుకు ఏడుస్తోంది అంటూ కామెంట్లు చేయగా అసలు విషయంలోకి వెళ్తే గోవాలో ఉన్న దీప్తి యోగాతో పాటు ఏరోబిక్స్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంటుంది . అందులో భాగంగానే షేర్ చేసిన ఫోటోలలో ఏడుస్తున్న ఫోటో కూడా ఒకటి. బహుశా ఇది కూడా యోగాలో భాగమేనని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: