సరిగ్గా ఒక వారం రోజులలో బిగ్ బాస్ -8 వ సీజన్ కూడా స్టార్ మాలో మొదలు కాబోతోంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా చాలామంది సెలబ్రిటీల పేర్లు వైరల్ గా మారుతున్నాయి. ఇందులో కొంతమంది పేర్లు ఖరారు చేశారని అగ్రిమెంట్లు కూడా జరిగాయనే విధంగా మాట్లాడుకుంటున్నారు. అలా బిగ్ బాస్  షో నిర్వాహకులు మొట్టమొదట ఒక సీరియల్ నటితో ఒప్పందం కుదుర్చుకున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. ఆ నటి ఎవరో కాదు తేజస్విని గౌడ.


సీరియల్స్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా బాగానే పేరు సంపాదించింది.. ముఖ్యంగా గత సీజన్లో రన్నర్ గా నిలిచిన అమర్దీప్ కి ఈమె భార్య అవుతుందట. ఈ జంట కి క్రేజ్ భారీగా ఉండడంతో కచ్చితంగా బిగ్ బాస్-8 వ సీజన్ కి ఈమె తీసుకురాబోతున్నారని అలాగే టైటిల్ కూడా గెలవబోతోందని చాలామంది అభిమానులు భావించారు. కానీ ఇప్పుడు సడన్గా తేజస్విని గౌడ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


తేజస్విని గౌడ ఈ షో నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తేజస్విని గౌడ్ ను సంప్రదించినప్పుడు ఈమె తనకు హౌస్ లోకి రావడానికి ఆసక్తి లేదని చెప్పేసిందట. అయితే తేజస్విని గౌరవ వల్ల బిగ్ బాస్ షో కి రేటింగ్ పెరుగుతుందని భావించిన షో నిర్వాహకులు ఈమెకు భారీగానే ఆఫర్ అందించారట.ఈ విషయం పైన గత కొద్దిరోజులుగా చర్చలు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్ రన్నర్ గా ఉన్న అమర్దీప్ తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే మూడింతలు రెట్టింపు తేజస్విని గౌడ డిమాండ్ చేస్తోందట.. అలా అయితేనే ఈ షోలో పాల్గొంటారని తెగేసి చెప్పేస్తుందట.. అంతేకాకుండా హౌస్ లోకి వస్తే కచ్చితంగా నెగెటివిటీ వస్తుందని భావించిందట తేజస్విని గౌడ.. దీంతో బిగ్ బాస్ షో నిర్వాహకులు మరొకరిని సంప్రదించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: