కొంతమంది హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత  కొన్నిసార్లు అవకాశాలు రాకపోవడంతో ఇతర వాటి పై అడుగులు వేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ ఒక టాలీవుడ్ హీరోయిన్ అందం అభినయం ఉన్నప్పటికీ ఎందుకు అవకాశాలను అందుకోలేకపోయింది. అందుకే ప్రస్తుతం స్పోర్ట్స్ యాంకర్ గా మారినట్టు తెలుస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా ఎన్నో రకాల చానల్స్ కు న్యూస్ ప్రజెంట్ గా కూడా పని చేసిందట. అలాంటి సమయంలోనే హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ సక్సెస్ అయినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు రాలేదట.

ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ చిత్రంలోని హీరోయిన్ శృతి సోది.. ముఖ్యంగా ఈమె తన డాన్సులతో స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత సుప్రీమ్ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ లో అలరించింది. మళ్లీ నవీన్ చంద్ర హీరోగా నటించిన మీలో ఎవరు కోటీశ్వరుడు అనే చిత్రంలో కూడా నటించింది. శృతి సోది తన చదువు పూర్తి అయిన తర్వాత బుల్లితెర పైన యాంకర్ గా మొదటిసారి తన కెరియర్ని మొదలుపెట్టింది.


అలా మొదట న్యూ ఎక్స్ ఛానల్ తో పాటు హిందీలో మరొక చానల్స్ లో కూడా పని చేసిందట. అలా పలు పంజాబీ చిత్రాలలో కూడా అవకాశాలు రావడంతో నటించిందట శృతి సోది. తెలుగు ప్రేక్షకులకు మాత్రం పటాస్ సినిమాతోనే పరిచయమైంది.గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్పోర్ట్స్ ప్రజెంటర్గా వ్యవహరిస్తోందట. సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజీ కలిగి ఉన్నది. సుమారుగా 9 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శృతి సోది కి సంబంధించి ఒక వీడియో కూడా ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈమెను మొదట అభిమానులు గుర్తుపట్టలేకపోయినా ఆ తర్వాత పటాస్ హీరోయిన్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: