నిన్నటి రోజున రాత్రి బిగ్ బాస్ తెలుగు-8 వ సీజన్ చాలా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇందులో చాలామంది సెలబ్రిటీలు, యాంకర్స్ కూడా రావడం జరిగింది.ఇప్పటివరకు 7 సీజన్లను పూర్తి చేసుకుంది.8వ సీజన్లో కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవాలని అడుగు పెట్టారు. నాగార్జున హోస్టుగా వ్యవహరించారు. ఇక గెస్టులుగా రానా, నివేద థామస్ , నాని ప్రియాంక మోహన్ తదితరులు రావడం జరిగింది. అయితే బిగ్ బాస్ షో కి సంబంధించి అన్ని సీజన్లో జరిగిన ఆసక్తి విషయాలను ప్రస్తుతం వైరల్ గా చేస్తున్నారు.


అలా గతంలో మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో టెంపరరీ హోస్టర్ గా అటు హీరోయిన్ రమ్యకృష్ణ, సమంత కూడ చేయడం జరిగింది.నాగార్జున బిజీగా ఉన్న సమయంలో వీరిద్దరూ కొన్ని వారాలపాటు హోస్టుగా హౌస్ని మెయిన్టైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్-4 లో సమంత ఒక వీకెండ్ వరకు హోస్ట్ గా చేసింది. నాగార్జున రెండు వారాలపాటు అందుబాటులో లేకపోవడం వల్లే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ మామగారి కోసం సమంత టెంపరరీ హోస్టుగా చేయడానికి అప్పట్లో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.


సమంతకి యూత్లో మంచి క్రేజ్ ఉండడం చేత బిగ్ బాస్ హోస్ట్ గా మారడంతో చూసే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది.. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 4 రేటింగ్ కూడా 11.4 టిఆర్పి రేటింగ్ రికార్డ్ స్థాయిలో బద్దలు కొట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. అయితే ఇదంతా కేవలం ప్రస్తుతం మాజీ మామ నాగార్జున కోసమే గతంలో చేసినట్లుగా సమాచారం. అయితే ఆ తర్వాత కాలంలో సమంత అక్కినేని కోడలిగా నుంచి విడిపోవడంతో మళ్లీ ఎప్పుడు కనిపించలేదు. గత సీజన్ 18.1 టిఆర్పి రేటింగ్ తో బాగానే దూసుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: