తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్-8 సీజన్ అలరిస్తోంది. ఇప్పటివరకు 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఎనిమిదవ సీజన్ ని కూడ ఆ వైపుగా వెళ్లేలా అడుగులు వేస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా సరికొత్తగా అలరిస్తూనే ఉంది. హౌస్ లో గొడవలు, కొట్లాటలు అరుపులతో చాలా రసవత్తంగా కొనసాగుతోంది. ముఖ్యంగా బిగ్ బాస్ -8 సీజన్లో ఎవరు ఊహించని విధంగా ట్విస్టులు, గేమ్స్ తో ఆడియన్స్ ని ఆశ్చర్య పరుస్తున్నారు బిగ్ బాస్. అలాగే ఎమోషనల్ గా కూడా కంటెస్టెంట్స్ టచ్ చేస్తున్నారు.


గతంలో లాగే ఈసారి కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వార కొంతమంది కంటెస్టెంట్లను లోపలికి తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పటికే 14 మందిలో ఒకరు ఎలిమినేట్ అయ్యారు.. కేవలం ఇప్పుడు 13 మంది మాత్రమే ఉన్నారు. రేపటి రోజున మరొక కంటెంట్ కూడా ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి ఎవరెవరు రాబోతున్నారని విషయానికి వస్తే.. జబర్దస్త్ ముక్కు అవినాష్ గతంలో కూడా సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇప్పుడు మరొకసారి వరల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.


వీరితో పాటు బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ అయిన రోహిణి కూడా రాబోతోందట. బిగ్ బాస్-7 సీజన్లో మొదటి కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన పావని కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. హౌస్ లో ఉన్న విష్ణు ప్రియ బెస్ట్ ఫ్రెండ్ అయినా యాంకర్ రీతు చౌదరి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.. అలాగే బుల్లితెర నటిగా పేరుపొందిన జ్యోతి రాయ్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరెవరు హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తారనే విషయం మరి కొద్ది రోజులలో తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: