తెలుగు బుల్లితెరపై అనసూయ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగానే క్రిజ్ ఉంది... అనసూయ మొదట న్యూస్ రీడర్ గా తన కెరీయర్ని మొదలుపెట్టి ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన అనసూయ జబర్దస్త్ యాంకర్ గా చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటించిన అనసూయ గతంలో కంటే భారీ క్రేజ్ అందుకున్నది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది.. అనసూయ క్రేజ్ ఎలా మారిపోయిందంటే దర్శకులే స్వయంగా ఈమె కోసం కొన్ని ప్రత్యేకమైన పాత్రలు, కథలు రాసే స్థాయికి ఎదిగింది.



అనసూయ అప్పుడప్పుడు వివాదాలకు తావు  ఇచ్చేలా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన భర్తతో కలిసి చేసేటువంటి పనుల వల్ల కూడా రచ్చ చేస్తూ ఉంటుంది. అనసూయ వయసు 39 సంవత్సరాలు అయినప్పటికీ కూడా హీరోయిన్లకు దీటుగా ఫిజిక్కుని మెయింటైన్ చేస్తూ హాట్ హాట్ గా ఫోజులు ఇస్తూ ఉంటుంది. అనసూయ ఎప్పటికప్పుడు తన మీద వచ్చేటువంటి విమర్శలకు కూడా దీటుగానే కౌంటర్ వేస్తూ ఉంటుంది. సినిమా పాత్ర కోసం ఏ విధంగా అయినా మారుతూ ఉంటుంది అనసూయ. ముఖ్యంగా జిమ్ వర్కౌట్లు చేస్తూ తన బాడీని ఫిట్నెస్ గా ఉంచేలా చూసుకుంటుంది.


అనసూయ అటు యాంకర్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేయడానికి కూడ అనసూయ అని పిలుస్తూ ఉంటారు. అనసూయ ను చూసేందుకు కూడా అభిమానులు భారీగానే తరలివస్తూ ఉంటారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ని బట్టి అందుకు తగ్గట్టుగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. అనసూయ ఒక్కో షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయాలి అంటే.. రూ.7 నుంచి 10 లక్షల రూపాయలకు పైగా ఛార్జ్ చేస్తోందట. అలాగే ఇతరత్రా ఖర్చులన్నీ కూడా ఆ షాపింగ్ మాల్ యజమానులే భరించాల్సి ఉంటుందట. ఏది ఏమైనా అనసూయ ఎంత డిమాండ్ చేసినా కూడా ఆమెతోనే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: