కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న బుల్లితెర నటుడు నిరూపమ్ పరిటాల రెండు తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబుగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు అందుకే కార్తీకదీపం-2 సీరియల్ లో కూడా నటించారు. నిరూపమ్ భార్య మంజుల కూడా బుల్లితెర నటి అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈమె చంద్రముఖి తో పాటు పలు రకాల సీరియల్స్ లో కూడా నటించింది. నిరూపమ్ పరిటాల, మంజుల ప్రేమించుకుని మరి వివాహం చేసుకున్నారు.


వీరిద్దరూ కలిసి చంద్రముఖి సీరియల్ నటిస్తున్న సమయంలో వీరి ప్రేమ మొదలయ్యిందట. ఆ తర్వాత ఇరువురి పెద్దల అంగీకారంతోనే వివాహం చేసుకున్నారు. నిన్నటి రోజున నిరూపమ్, మంజుల పెళ్లిరోజు కనుక అభిమానులు పెద్ద ఎత్తున వీరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సరిగ్గా వీరి వివాహమై 15 సంవత్సరాలు అవుతుందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పలు రకాల ఫోటోలను నిరూపమ్, మంజుల మరొకసారి వివాహం చేసుకుంటూ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.


నిరూపమ్ దంపతులు ప్రస్తుతం మరొకసారి సాంప్రదాయమైన పద్ధతిలో వివాహం చేసుకున్నట్లు ఒక వీడియోలు వైరల్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఒకసారి ఆశ్చర్యపోతూ.. ఎందుకు డాక్టర్ బాబు ఇలా చేశావు అంటే పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ బాబు, మంజుల ఈ వీడియోలో మాట్లాడితే మా పెళ్లికి మీరే రండి అంటూ పిలుస్తున్నారు.. అయితే ఈ పెళ్లి చాలా సాంప్రదాయమైన పద్ధతిలోని మరొకసారి జరుపుకున్నట్లుగా కనిపిస్తోంది. లక్ష్మీనరసింహస్వామి గుడిలో వీరి వివాహం జరుపుకున్నట్లుగా వీడియోలో తెలియజేస్తున్నారు. అయితే తమ పాత పెళ్లి వీడియోకి ఈ వీడియోకి కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారంటే తెలియజేస్తున్నారు ఈ జంట. వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: