తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ ఒకటవ తేదీన చాలా గ్రాండ్ గా మొదలైన ఈ షోలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అయితే అప్పుడే ఆరు వారాలు పూర్తయ్యాయి. ఆరు వారాలకు గాను మొత్తం ఏడు మంది ఎలిమినేట్ అవ్వగా.. ఏడవ వారం లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

కర్ణాటక ప్రాంతానికి చెందిన పృథ్వీరాజ్ శెట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకున్నారు. అలా తొలుత మోడల్గా కెరియర్ మొదలుపెట్టిన ఈయనకు  అర్ధాంగి సీరియల్లో అవకాశం రావడంతో కన్నడ సీరియల్ లో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు.  ఆ తర్వాత టాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటించిన ఈయనకు నాగపంచమి సీరియల్ ద్వారా మంచి పేరు లభించింది. ఈ సీరియల్. తెచ్చిపెట్టిన క్రేజ్ తోనే హౌస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

ఇకపోతే ఏడు వారాలపాటు కొనసాగిన పృధ్విరాజ్ ఏడవ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. విష్ణు ప్రియ తో లవ్ ట్రాక్ నడుపుతూ ఆడియన్స్ కి మంచి కంటెంట్ ఇచ్చారనే చెప్పాలి .ఒకవైపు యష్మీ అంటే ఇష్టం అంటూనే విష్ణు ప్రియ ను వాడుకున్నాడు అంటూ మరికొంతమంది కామెంట్లు చేశారు. మొత్తానికైతే ఏడవ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రియుడు ఎలిమినేట్ అవ్వడంతో ఆయన ప్రేయసి విష్ణు ప్రియ ఎమోషనల్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలి అంటే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఇతనికి తెలుగు ఆడియన్స్ లో పెద్దగా గుర్తింపు లేదు. ఈ మేరకు ఆయనకు విష్ణుప్రియ కారణంగానే ఓట్లు పడ్డాయని,  ఆమెతో లవ్ ట్రాక్ ఇతడికి బాధా కలిసి వచ్చింది అని కూడా కామెంట్లు వినిపించాయి. ఇక ఎట్టకేలకు తన ఆటతో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు కాబట్టి ఈవారం ఎలిమినేట్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: