తెలుగు బిగ్ బాస్ సీజన్ -8 లోకి వైల్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ మెహబూబ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ అనుకోకుండా 8వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. వాస్తవానికి చాలా మంది నయని పావని అవుతుందని భావించినప్పటికీ నాగార్జున ఆమెను సేవ్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. మెహ బూబ్ ను ఎలిమినేట్ చేయడం జరిగింది. దీంతో ఎలిమినేట్ అయిన వారి సంఖ్య 9 కి చేరడం జరిగింది.


ఎనిమిదో వారంలో 6 మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నప్పటికీ కూడా మెహబూబ్, నాయిని పావని చాలా తక్కువ ఓట్లు పడ్డాయి.. చాలా మంది రివ్యూవర్స్ కూడా పావనిని బయటికి వస్తుందనుకున్నప్పటికీ.. మెహబూబ్ బయటికి రావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు 3 వారాల పాటు హౌస్ లో కొనసాగిన మెహ బూబ్ అక్టోబర్ ఆరవ తేదీన హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ప్రతి వారానికి కూడా రూ .5 లక్షల రూపాయలు మెహబూబ్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


దీంతో మూడు వారాలకు గాను మొత్తం మీద రూ .15 లక్షల రూపాయలు అందుకున్నట్లు సమాచారం. గతంలో కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ నాలుగవ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు కూడా ఎలిమినేట్ సరిగ్గా దీపావళి పండుగకి కావడంతో ఇప్పుడు కూడా అదే పండుగకి కావడంతో కాస్త ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది మెహబూబ్.. అంతేకాకుండా హౌస్ లో ఉన్న గంగవ్వకు కూడా మాట ఇవ్వడం జరిగింది.. అవ్వ నీకు నేనున్నాన నీకు ఎలాంటి సహాయం కావాలన్నా కూడా కచ్చితంగా చేస్తాను మీ చిన్న బిడ్డగా చెబుతున్నాను అంటూ తెలిపారు మెహబూబ్. మరి రాబోయే రోజుల్లో నైనా ఏవైనా సినిమాలలో కూడా అవకాశాలు వస్తాయని చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: