సీరియల్స్, బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక జైన్ కూడా ఒకరు.. తెలుగు బుల్లితెర పైన తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఇమే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.. చదివింది బెంగళూరులో అయినప్పటికీ కూడా చిన్నతనం నుంచే ప్రియాంకకు నటన పైన మక్కువ ఉండడంతో ఆవైపు కాని అడుగులు వేసిందట.


2015 సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక తమిళ సినిమా రంగి తరంగ అనే చిత్రంతో తన నటనను మొదలుపెట్టింది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలా అవకాశాలు వెలుపడ్డాయి. అలా 2016లో గోలిసోడా అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత హైదరాబాదులోని సెటిల్ అయ్యింది. చెల్తే చల్తే అనే సినిమాతో ఆకట్టుకున్న ప్రియాంక జైన్.. మరాఠి, హిందీ, కన్నడ తమిళ్ ,తెలుగు వంటి భాషలలో సుదీర్ఘంగా కూడా మాట్లాడుతుందట. ఆ తర్వాత 2017 లో మౌనరాగం అనే సీరియల్ ద్వారా బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చింది.


ఇక బుల్లితెర పైన తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకున్న ప్రియాంక జైన్ తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత సినిమాల విషయానికి వస్తే వినరా సోదర వీరకుమార, ఎవడు తక్కువ కాదు తదితర చిత్రాలలో నటించింది. బిగ్ బాస్ -7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఇమే తనదైన ఆటతో మెప్పించింది. తన ఆటతీరుతో మాట తీరుతా ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేసిన ఈమె తాజాగా తన ప్రియుడుతో కలిసి రొమాంటిక్ మూడులో వెళ్ళిపోయి మరి ఒక వీడియోని షేర్ చేసింది.. తన ప్రియుడు కౌగిలిలో బందీ అయ్యిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకి క్యాప్షన్ కి స్టోరీ ఆఫ్ ఎవరీ షార్ట్ గర్ల్ అంటూ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: