తెలుగు వెండితెర పైన యాంకర్ గా నటిగా భారీ క్రేజీ సంపాదించుకుంది అనసూయ. అనసూయ బుల్లితెర పైన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అందుకే వెండితెర పైన అంతే సక్సెస్ అయ్యింది. అనసూయ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. జబర్దస్త్ తో భారీ క్రేజీ సంపాదించుకొని నటి అయిన తరువాత కూడా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నది అనసూయ. ఈమె నటించిన ప్రతి పాత్ర కూడా తన క్రేజ్ పెరగడానికి సహాయపడిందని చెప్పవచ్చు. అందుకే స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటిస్తోంది అనసూయ



అనసూయకు రంగస్థలం సినిమాతో పెద్ద బ్రేక్ పడింది. ఆ తర్వాత పుష్ప, పుష్ప 2 వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. అయితే అనసూయ కెరియర్ లో అత్యధికంగా హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న సినిమా ఇదే అంటే ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది. అనసూయ టాలీవుడ్ లో తన కాల్ షీట్లు రోజుకి చొప్పున ఇస్తోందట. దీని ప్రకారం పుష్ప 2 చిత్రానికి అనసూయ అత్యధికంగా 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు రోజుకి ఛార్జ్ చేసిందట.


అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్తో సినిమా ఆఫర్లు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పెదకాపు అనే చిత్రంతో హీరోగా మారిన విరాట్ కర్ణ తన తదుపరి చిత్రమైన నాగబంధం అనే సినిమాలో అనసూయ కీలకమైన పాత్రలో నటిస్తోందట. ఇందుకోసం అనసూయ రోజుకి 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు అందుకుంటున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఈ పాత్రకు అనసూయని సెట్ అవుతుందని నిర్మాతలు భావించడంతో అనసూయని ఏరి కోరి మరి ఎంచుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారుతోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు అంటే పాన్ ఇండియా చిత్రంలో కూడా కనిపించబోతోంది అనసూయ. మరి రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాలలో నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: