తెలుగు బుల్లితెర పైన సీరియల్స్ పరంగా టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. ఇది స్టార్ మా చానల్స్ లో ప్రసారమవుతూ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం బుల్లితెర మీద ప్రసారమవుతున్న పలు సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తోంది బ్రహ్మముడి సీరియల్. ఈ సీరియల్ లో మానస్ నాగులపల్లి అలాగే దీపిక రంగరాజు వంటి వారు నటిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా షర్మిత్ గౌడ, గిరిశంకర్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.


అయితే సీరియల్స్ కోసం ఇందులో కొంత మంది నటీనటుల రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఇదే విషయానికి సంబంధించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ సీరియల్లో రాజ్ కంటే ఎక్కువగా కావ్యనే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీరియల్ లో ఒక్కో ఎపిసోడ్కి మానస్ రూ.30 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో సుమారుగా 20 రోజులపాటు ఈ సీరియల్స్ షూటింగ్లో మానస్ పాల్గొంటారట. అలా  నెలకు రూ.5 నుంచి రూ.6 లక్షలు తీసుకుంటున్నారు.

ఈ సీరియల్ లో నటిస్తున్న దీపిక రంగరాజు కూడా ఒక్కో ఎపిసోడ్ కి  35వేల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అలా నెలకి కూడా సుమారుగా రూ.6 నుంచి రూ.7 లక్షల రూపాయల వరకు అందుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఈ సీరియల్ లో విలన్ పాత్రలో నటిస్తున్నటువంటి రుద్రాణి (షర్మిత గౌడ) కూడా ఒక్కో ఎపిసోడ్కి 20వేల రూపాయల వరకు తీసుకుంటున్నది.. అలా నెలకి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. అలా మొత్తానికి బ్రహ్మ ముడి సీరియల్ ద్వారా దీపికా రంగరాజు, షర్మిత గౌడ ఇద్దరు కూడా కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: