
భారత్ గర్వించే ఇస్రో కీర్తి కిరీటంలో కలికితురాయి చేరింది. ఇస్రో మరోసారి అంతరిక్ష ప్రయోగాల్లో తనకు ఎదురులేదని చాటింది. అత్యంత శక్తివంతమైన సమాచార ఉపగ్రహం జి-శాట్ 30ని విజయవంతంగా ప్రయోగించింది.
ఏరియాన్ -5 వాహకనౌక 38నిమిషాల్లో జీ-శాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ట్విట్ చేశారు. ఇన్ శాట్ - 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్ -30 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ధ్రువీకరిస్తూ ఏరియాన్ స్పేస్ సీఈఓ స్టెఫాన్ ఇస్రాల్ ట్వీట్ చేశారు.
కొత్త ఏడాదికి బలమైన ప్రారంభం మొదలైంది. ఏరియాన్-5 రాకెట్ ద్వారా యుటెల్సాట్ కనెక్ట్, జీశాట్-30 జియోస్టేషనరీ ట్రాన్స్ ఫర్ ను కక్ష్యలో ప్రవేశపెట్టాం అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఫ్రెంచ్ గయానా నుంచి ఈ ప్రయోగం జరిగింది.
ఈ ప్రయోగంతో నాణ్యమైన టెలివిజన్ ప్రసారాలు, టెలికమ్యూనికేషన్ , బ్యాడ్ క్రాస్టింగ్ సేవలు మరింత మెరుగవుతాయి. దక్షిణ అమెరికా ఈశాన్య తీరంలో ఉన్న ఫ్రెంచ్ భూభాగంలోని కౌరులోని ఏరియాన్ లాంఛ్ కాంప్లెక్స్ నుంచి తెల్లవారుజామున 2. 35 నిమిషాలకు ఈ ప్రయోగం చేపట్టారు.