ఇక apple కంపెనీ తన మొదటి ఈవెంట్‌ని 2022 మార్చి 8 వ తేదీన, మంగళవారం నాడు అనగా ఈరోజు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. ఈ టెక్ దిగ్గజం ఈరోజు రాత్రి 11.30 గంటలకు 'పీక్ పెర్ఫార్మెన్స్' ఈవెంట్‌ను హోస్ట్ చేస్తుంది. ఈవెంట్ సందర్భంగా, టెక్ దిగ్గజం iphone SE 5g, కొత్త ఐప్యాడ్ ఇంకా అలాగే మరిన్నింటిని ప్రకటించాలని భావిస్తున్నారు. ఇక నివేదికల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. iphone SE 5g 4.7-అంగుళాల డిస్‌ప్లే, సింగిల్ రియర్ కెమెరా ఇంకా అలాగే హోమ్ బటన్‌పై టచ్ ఐడిని కలిగి ఉంది. కొత్త iphone SE 5g కోసం కంపెనీ iphone SE 2020 డిజైన్‌కు కట్టుబడి ఉందని నివేదికలు జోడించడం అనేది జరిగింది. కొత్త ఐఫోన్ 64GB, 128GB ఇంకా అలాగే 256GB నిల్వ ఎంపికలు ఇంకా అలాగే మూడు రంగులు - తెలుపు, నలుపు మరియు ఎరుపు రంగులలో రావచ్చు. వేగవంతమైన చిప్ కూడా ఉంటుంది.


బహుశా 5g సపోర్ట్ కోసం A15 బయోనిక్ అనేది ఉండొచ్చు. ఇక ఈ ఆపిల్ ఈవెంట్‌ను apple TV యాప్‌తో పాటు apple YouTube ఛానెల్‌లో కూడా మనం చూడవచ్చు.భారతదేశంలో iphone SE 2 ధర ఎంత వరకు ఉండ వచ్చు అంటే.. ప్రస్తుతం, apple India వెబ్‌సైట్‌లో iphone SE 2 (64GB) ధర వచ్చేసి రూ. 39,900 ఇంకా అలాగే 128GB స్టోరేజ్ మోడల్ ధర వచ్చేసి రూ. 44,900 ఉంటుంది. ఇది బేస్ మోడల్ కోసం రూ. 30,298కి ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మనకు అందుబాటులో ఉంది. ఇక ఇది 128GB ఇంటర్నేషనల్ స్టోరేజ్ ఆప్షన్ తో రూ. 35,298 ధరతో మనకు అందుబాటులో ఉంది. అలాగే మరో 256GB ఆప్షన్స్ వచ్చేసి రూ. 45,298 ధరతో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: