తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పై లోన్ పిలిచే యాప్ లను దాదాపుగా 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారట.. ఇది పలు రకాల దేశాలలో కూడా వీటిని డౌన్లోడ్ చేసుకున్నారట. ఈ యాప్లను అన్ఇన్స్టాల్ చేసి డివైస్ అకౌంట్లను కూడా రక్షించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సైబర్ సెక్యూరిటీ సంస్థలు సలహా ఇస్తున్నాయి.. స్పైలోన్ యాప్లు 2023 నుండి ప్రారంభమై యూజర్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టాయని ఈ యాప్స్ ద్వారా లోన్స్ ఈజీగా అందిస్తున్నాయని.
ఈ యాప్ల ద్వారా ఫోన్లో నుంచి అకౌంట్ నుంచి డీటెయిల్స్ మెసేజ్ కాంట్రాక్టు వంటి వాటిని సులువుగా దొంగలిస్తారని తెలియజేస్తున్నారు.. స్పైలోన్ యాప్స్లుగా గుర్తించిన వాటిలో..AA క్రెడిట్, గుయ్య బాక్యాష్, ఈజీ క్రెడిట్, అమోరు క్యాష్, క్యాష్ వావ్, ఫ్లాష్ లోన్, క్రెడిబస్, గో క్రెడిట్, ఇన్స్టాంటానే ప్రెస్టామో, రాపిడోప్ క్రెడిట్, యూనికాష్.. తదితర యాప్స్ సైతం ఇన్స్టాల్ చేసిన యూజర్స్ సైతం తమ అకౌంట్ సురక్షితంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలని సైబర్ నిపుణులు తెలుపుతున్నారు. అప్పుడప్పుడు మొబైల్ ని సైతం రీస్టార్ట్ చేయడం వల్ల వీటి బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందట.