జియో ఎలాంటి పని చేసినా కూడా సంచలనంగానే ఉంటుంది.. త్వరలోనే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ సైకిల్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఇది ఒక్కసారి చార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట. ఈ సైకిల్ ని అదునాతిన సాంకేతికగా తయారు చేశారట.. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ రోజు వారు ప్రయాణాన్ని మరింత సులభతరంగా ఉంచేలా చేయడమే కాకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందట. మరి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క ధర ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


జియో ఎలక్ట్రిక్ సైకిల్ సరసమైన ధరకే అందరికీ అందుబాటులో ఉంటుందట. ఈ సైకిల్ ఆధునిక డిజైన్ తో తయారు చేయడమే కాకుండా అందరిని ఆకర్షించే విధంగా ఉంటుందట. మహిళలకు కూడా అనుకూలంగానే ఈ సైకిల్ ని తయారు చేశారట. LED లైట్ల తో పాటు డిజిటల్ డిస్ప్లే కూడా ఈ జియో సైకిల్ కి అమర్చడం జరిగిందట. అధిక నాణ్యత గల పదార్థాలతో ఈ సైకిల్ ని చాలా సౌకర్యవంతంగా దృఢంగా ఉండేలా తయారు చేశారట. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ కలిపి ఉండడం వల్ల 400 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందట.


అలాగే ఈ సైకిల్ లో ఎకో మోడ్ నుంచి హై స్పీడ్ మోడ్ వరకు బహుళ ఎంపికలు కలిగి ఉంటాయట. GPS రాకింగ్ స్మార్ట్ కనెక్టివిటీ రివర్స్ 3 వంటి సదుపాయాలు కూడా ఉంటాయట. వాటర్ ప్రూఫ్ డిజైన్ తో పాటుగా ఏ రోడ్డుపైనైన సరే సుజావుగా నడిచేలా ఈ సైకిల్ ని తయారు చేశారట. ఈ జియో ఎలక్ట్రిక్ సైకిల్ ధర 25 వేల నుంచి 35వేల రూపాయల మధ్యలో ఉంటుందట. ఈ జియో సైకిల్ ఈ ఏడాది నుంచే ప్రారంభించబోతున్నారట. సామాన్యులకు కూడా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ చాలా ఉత్తమమైనదిగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: