సైన్స్ ఆలోచనలకు కూడా తట్టని ఎన్నో రహస్యాలు, ఈ అనంత విశ్వంలో ,కోటానుకోట్ల లో ఉన్నాయి. అలాంటి వాటిలో అత్యంత రహస్యం తో కూడుకున్న శివాలయం కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందింది. ఆ శివాలయం ఏదో కాదు అచలేశ్వర్ మహదేవ్ ఆలయం.. ఈ ఆలయం యొక్క విశిష్టతను, ఈ ఆలయంలో ఉన్న ఈ వింతను మాత్రమే తెలుసుకుందాం..ఇక ఆ రహస్యాన్ని పరిశోధకులు కూడా చేయించలేక పోతున్నారు.
ఈ ఆలయం రాజస్థాన్ లోని హీరోని జిల్లాలో తోల్పూర్ ప్రాంతంలో ఉన్న అచలేశ్వర్ మహాదేవ ఆలయం. సాధారణంగా శివలింగం అనగానే మనం చల్లని మంచి రూపంలోనూ , లేక నల్ల రాతి రూపంలోనూ చూస్తూ ఉంటాం.. కానీ ఈ దేవాలయంలో పరమ శివుడు లింగం మాత్రం రోజుకు మూడు రంగులు మారుస్తూ ఉంటుంది.. తెలిసిన వారికి పక్కనబెడితే, తెలియని వారికి ఇది ఒక పెద్ద వింత అని చెప్పవచ్చు. శివలింగం ఏమిటి ..?రంగులు మార్చడం ఏమిటి..? అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ శివలింగం పై ఎన్నో పరిశోధనలు చేసిన పరిశోధకులు కూడా రహస్యాన్ని ఛేదించ లేకపోతున్నారు.
ఉదయం పూట ఈ శివలింగం ఎర్రగా కనిపిస్తే , ఇక మధ్యాహ్న సమయంలో కాషాయం రంగులో కనిపిస్తుందట. సాధారణంగా సాయంత్రం పూట నల్లని రూపంలోకి మారుతుంది.. అని కొంతమంది పరిశోధకులు తేల్చడం జరిగింది. ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు వేలల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉంటారు. ఈ శివాలయంలో పరమశివుడు స్వయంభూగా వెలిశాడు అని అక్కడ ప్రజల నమ్మకం.