వైరల్: కొత్త రైల్వే రూల్స్.. ఇక ఆ పప్పులు ఉడకవు?


కాలం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం డిజిటల్   యుగంలో వున్నాము. రైల్వే ప్రయాణం అనేది ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో వుండే ప్రయాణం. అందువల్ల రైలులో ఎలా పడితే అలా ఉంటారు వ్యక్తులు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్  అనేవి వచ్చాయి. వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఇప్పటికే ఈ నిబంధనలు అమలులో ఉండగా.. వీటిని ప్రయాణీకులు కచ్చితంగా పాటించాలని రైల్వేశాఖ తెలిపింది. ఎందుకంటే ఇప్పటికే పలువురు ప్రయాణీకుల నుంచి రాత్రివేళల్లో కొంతమంది బిగ్గరగా అరుస్తున్నారని, లైట్లు వేస్తున్నారంటూ పలు ఫిర్యాదులు అందటంతో.. రూల్స్ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది రైల్వే శాఖ. ఎవరైనా అతిక్రమిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.ఇక ఆ రూల్స్  ఏంటో  ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రైలులో ప్రయాణించేటప్పుడు.. ఒకరికి సీట్ కన్ఫర్మ్ అయ్యి.. మరొకరికి అవ్వకపోతే.. ఒకవేళ అందులో కన్ఫర్మ్ అయిన వ్యక్తి ప్రయాణించకపొతే.. దాన్ని సీట్ కన్ఫర్మ్ కాని వ్యక్తికి కేటాయించాలి.సీట్ కేటాయించిన వ్యక్తులు రాకపోతే రెండు స్టేషన్లు లేదా గంట తర్వాత వేరేవారికి టీటీఈ సీటు కేటాయించాలి.కేటాయించిన సీటుకు సంబంధించిన ప్రయాణీకులు ఎవరైనా రాకపోతే.. దాన్ని వేరే ప్రయాణీకులకు(ఆర్ఏసీ) కేటాయించకూడదు.రాత్రి 10 గంటల తర్వాత టీటీలు టికెట్ల చెకింగ్  చేయరాదు.మిడిల్ బెర్త్ వచ్చిన ప్రయాణీకులు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిద్రపోవచ్చు.ప్రయాణీకులు, రైల్వే ఎస్కార్టు, మెయింటెనెన్స్‌ స్టాఫ్‌.. ఇలా ఎవ్వరూ కూడా రాత్రివేళ రైళ్లల్లో గట్టిగా అరవకూడదు.స్పీకర్ పెట్టి సెల్‌ఫోన్లలో పాటలు వినకూడదు.రాత్రి 10 గంటల తర్వాత రైళ్లలో ప్రయాణించే ఏ ప్రయాణికుడు కూడా గట్టిగా మాట్లాడకూడదు. అలాగే లైట్లు కూడా వెయ్యకూడదు.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన నియమాలు గుర్తుపెట్టుకొని రైల్వే ప్రయాణం చెయ్యండి. లేదంటే భారీ మూల్యం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: