
దాదాపుగా 48 వేల ఏళ్లు పైగా ఉన్న ఆర్కిటిక్ మంచు కింద కప్పబడిన జాంబి వైరస్ సోకిందంటే మనిషి శరీరంలో ఉండే కాళ్లు చేతులు వంకర పోయి పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తారట.. ముఖ్యంగా విచక్షణ జ్ఞానం కోల్పోయి మృగంలా మారిపోతారని.. ఇది వినడానికి ఒక జాంబీ సినిమా కథల ఉన్నప్పటికీ రియల్ లైఫ్ స్టోరీ అన్నట్లుగా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందంటూ సైంటిస్టులు సైతం తెలుపుతున్నారు.. అయితే ఈ వైరస్ దాదాపుగా 48,500 ఏళ్ల క్రితమే మంచు కింద కప్పేయబడిందట కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ ప్రాంతంలో మంచు వేగంగా కరిగిపోతోందని దీనివల్ల వైరస్ బయటకి వస్తోందంటూ యూనివర్సిటీ సైంటిస్టులు తెలుపుతున్నారు.
ఈ జాంబి వైరస్ వచ్చిందంటే పోలియోతరహాలు జనం అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని దీనివల్ల పెనుముప్పు కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.. ఈ వైరస్ కొన్ని వేల ఏళ్ల క్రితం కప్పబడినప్పటికీ ఇప్పటికీ సహజీవంగానే ఉందట.. ఆర్కిటిక్ మంచు కరుగుతూ ఉండడంతో ఆ నీటి ద్వారా వైరస్ ప్రజలలోకి వచ్చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.. అంతేకాకుండా ఈ జాంబి వైరస్ గాలి ద్వారా కూడా ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయట.. రష్యాలోని సైబీరియన్ వంటి ప్రాంతాలలో కరుగుతున్న మంచులను పరీక్షించిన కొంతమంది సైంటిస్టులు అక్కడ 13 కొత్త తరహా వైరస్లను 2022లో గుర్తించారట.. అందులో ఈ జాంబి వైరస్ కూడా ఒకటిగా ఉందని తెలిపారు.. సైబీరియా వంటి ప్రాంతాలలో పరిశ్రమలు పెరగడం ఆయిల్ బయటికి తీయడం ట్రాఫిక్ పెరగడం వల్ల మంచి వేగంగా కరుగుతోందని తెలుపుతున్నారు. ఒకవేళ ఈ వైరస్ వస్తే జరిగే నష్టం ఊహకే వదిలేస్తున్నామంటూ నిపుణులు తెలుపుతున్నారు.