అపర కుబేరుడు ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ముఖేష్ అంబానీనే పేరు చెబుతూ ఉంటారు.. ఈయన కుమారుడు ఆనంత్ అంబానీ , రాధిక మర్చంట్ల వివాహం ముంబైలో చాలా గ్రాండ్ గా జరిపించారు. ప్రపంచంలోనే నలుమూలల ఉండే వ్యాపార దిగ్గజ సంస్థల అధినేతలు, సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా రావడంతో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి. తన వ్యాపార సామ్రాజ్యాన్ని అన్నిచోట్ల విస్తరింప చేయడంలో అనంత అంబానీ కుటుంబం దిట్ట అని చెప్పవచ్చు.


ముఖ్యంగా అనంత్ అంబానీ వివాహ వేడుకలో వారి వద్ద ఖరీదైన వస్తువులు విలాసవంతమైన కారులు సామాగ్రి వంటివి హైలైట్ గా నిలిచాయి. ఆస్తుల గురించి ముఖ్యంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి వివాహానికి 5000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అలాగే వీరు ప్రతినెల సుమారుగా 70 లక్షల రూపాయల కరెంటు బిల్లును కూడా కడుతున్నారట. తాజాగా ముఖేష్ అంబానీ దుబాయ్ లో ఒక లగ్జరీ విల్లాను సైతం తన కొడుక్కి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. దుబాయ్ లో పామ్ జుమేరాలో సముద్ర తీరంలో ఒక అత్యంత ఖరీదైన విలాసమైన విల్లాను కూడా నిర్మించినట్లు తెలుస్తోంది.


ముఖేష్ అంబానీ 2022లో దీన్ని సుమారుగా 640 కోట్ల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంత్ అంబానీ ఇది తన కుమారుడికి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో 10 బెడ్ రూములు ప్రైవేటు స్పా 70 మీటర్లు పొడవైన ఒక ప్రైవేటు బీచ్ కూడా కలిగి ఉన్నది ఇది దుబాయ్ లోనే చాలా విలాసవంతమైన నివాసాలలో ఒకటిగా పేరు సంపాదించింది. అయితే వీరికి ఇలాంటివి ఇక్కడే కాకుండా ఎన్నెన్నో ప్రాంతాలలో కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన చాలామంది సెలబ్రిటీలకు ఐదు కోట్ల రూపాయలు విలువ చేస్తే వాచ్లు కూడా ఫ్రీగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ పెళ్లిలో అంబానీ భార్య చాలా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: