ఢిల్లీ మెట్రో ట్రైన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు యువతీ యువకుల రొమాన్స్ కారణంగా, రద్దీ కారణంగా , కొన్నిసార్లు మెట్రో లోపల తగాదాలు .. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం.. ఇలా ఎన్నో కారణాలతో ఢిల్లీ మెట్రో ట్రైన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటుంది.ఇంకా అంతేకాదు కొంతమంది పాటలు పాడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో మనకు కనిపిస్తున్నాయి. కొన్ని సార్లు ప్రయాణీకులు ఆటపాటలను మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే ఢిల్లీ మెట్రో రైలు లోపల ఎవరైనా మేకప్ చేసుకోవడం ఇంతవరకు మీరు ఎప్పుడైనా చూశారా? అవును, అలాంటి ఒక వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు మెట్రో బోగీ లోపల కూర్చున్నారు. అక్కడ ఏదో బ్యూటీ పార్లర్‌లో కూర్చున్నట్లు గా వారు కూర్చుని మొహానికి మేకప్ చేసుకుంటున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు అమ్మాయిలు మెట్రో బోగీ లోపల కూర్చున్నారు.


అయితే ఆ బోగీ మాత్రం ప్రయాణికులు లేక చాలా ఖాళీగా కనిపిస్తోంది. అక్కడ ఆ ఇద్దరు యువతుల పక్కన ఏ ప్రయాణీకుడు లేడు. అలాంటి పరిస్థితిలో ఆ ఇద్దరు యువతులు తమకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వెంటనే అక్కడే మేకప్ చేసుకోవడం ప్రారంభించారు. ఆ అమ్మాయిలిద్దరూ కూడా ముఖానికి క్రీమ్ రాసుకోవడం.. మేకప్ వేసుకోవడం కోసం కూర్చున్న విధానం చూడటానికి చాలా ఫన్నీగా ఉంది. ఒక అమ్మాయి అయితే కాళ్లను ముడిచి ఇంట్లో కూర్చున్నట్లు కామెడీగా కూర్చోగా మరో అమ్మాయి మాత్రం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. అయితే వీరిద్దరూ ఢిల్లీకి చెందిన యువకులే అని చెబుతున్నారు. మెట్రో లోపల ఇలాంటి సంఘటనలు చూడడం చాలా అరుదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో delhi.connection అనే ఐడితో షేర్ చేశారు. దీన్ని ఇప్పటి దాకా 40 వేల పైగా చూడగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియో కింద వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వివిధ రకాలుగా ఫన్నీగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: