ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రతి ఇంట్లోకి పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలు అందరూ కూడా ఈ సోషల్ మీడియా మాయలోనే మునిగి తేలుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్ని పనులు ఉన్నా సరే అటు సోషల్ మీడియా వాడకాన్ని మాత్రం అసలు తగ్గించడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో దొరుకుతూ ఉండడంతో ఇక మరొక విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా పోయింది. మనుషులతో మాట్లాడటం తక్కువ చేసి సోషల్ మీడియాలో గడపడం ఎక్కువ చేస్తున్నారు నేటి రోజుల్లో జనాలు.


 ఇలా సోషల్ మీడియా ప్రతి ఇంటికి పాకిపోయిన నేపథ్యంలో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ప్రతిరోజు ఎన్నో రకాల ఘటనలు, ఎన్నో వీడియోలు కూడా వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలా వెలుగులోకి వచ్చిన వీడియోలలో కొన్ని నవ్విస్తే ఇంకొన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. మరి కొన్ని వీడియోలు మాత్రం మనస్సును హత్తుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా మనుషులకి గోవులకి మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది.


 ఇక మన పురాణాల.. ప్రకారం శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి ఊదుతుంటే  చుట్టుపక్కల ఉన్న లేగా దూడలు అన్నీ కూడా శ్రీకృష్ణుడు చుట్టూ చేరి ఆ సంగీతాన్ని ఆస్వాదించేవి అని. నిజమే అన్న విధంగా ఇప్పుడు ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి ఊదితే  లేగ దూడలు గంతులు వేస్తూ చెంతకు వచ్చేది అని పురాణాల్లో విన్నట్లుగానే ఇక్కడ లేక దూడలు ప్రవర్తించాయి. ఓ మహిళ గోషాలలో పిల్లనగ్రోవి ఊదుతుంటే లేగదూడలు ఆమె దగ్గరికి వచ్చాయి. సంగీతం వింటూ సంబరంతో ఎగిరి గంతులు వేసాయ్. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ నేటిజన్స్ అందరి మనసును హత్తుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: