ముఖ్యంగా అర్జునుడికి పెద్ద కుమారుడు ఉన్నారని సంగతి కూడా చాలామందికి తెలియకపోవచ్చు. మహాభారతం ఇతిహాసం ప్రకారం అర్జునుడు పలు రకాల దేశాల, కాలాల పరిస్థితులతో నాలుగు వివాహాలు చేసుకున్నారట. అర్జునుడి మొదటి భార్య పేరు ద్రౌపది, ఈమె ద్రుపద రాజ కూతురు.. ఇక రెండవ భార్య శ్రీకృష్ణుడు చెల్లెలు సుభద్ర. ద్రౌపది పాండవులను ఐదు మందిని పెళ్లి చేసుకొని ఐదు మందికి సంతానం అందించింది. అర్జునుడు త్రౌపదికి పుట్టిన కొడుకే శ్రుతకర్మ.. ఇక భీముడు ద్రౌపదిలకు జన్మించిన కుమారుడు సుత సోమ, యుధిష్ఠురుడు ద్రౌపదికి జన్మించిన కుమారుడు పేరు ప్రతి వింధ్య, నకులుడు ద్రౌపదికి పుట్టిన కుమారుడికి శతానిక, సహదేవుడు ద్రౌపదికి పుట్టిన కుమారుడు శృతసేన అని పేర్లు ఉన్నవి.
వీరందరిని ఉపపాండవులు అని పిలిచేవారు. సుభద్ర అర్జునుడిలా కుమారుడు అభిమానుడు.. కానీ అర్జునుడు ద్రౌపది సుభద్ర లను మాత్రమే కాకుండా మరో రెండు వివాహాలు కూడా చేసుకున్నారు. అర్జునుడి పెద్ద కుమారుడు పేరు ఇరవణుడు. ఈ వివాహాలను 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసి సమయంలో ఈ వివాహం జరిగిందట. అజ్ఞాతవాసం సమయంలో దివ్య ఆయుధాల కోసం నాగలోకానికి వెళ్ళినప్పుడు అర్జునుడు నాగాలోక యువరాణి ఉలిపిని వివాహం చేసుకున్నారట. వీరిద్దరికి జన్మించిన కుమారుడే ఇరవనుడు. ఇతిహాసాల ప్రకారం అర్జునుడి మొదటి కుమారుడే ఇతను. శృతకర్మ, అభిమన్యుడు కంటే పెద్దవాడూ.
ఇరవర్ణుడు కూడా పాండవుల తరఫున మహాభారత యుద్ధంలో పాల్గొంటారట.. కౌరవుల తరఫున పోరాడుతున్న సమయంలో అలంబుష్ అనే ఒక రాక్షసుడు చేతిలో మరణిస్తాడు. అర్జునుడు నాలుగవ వివాహం పాండవుల వనవాసకాలంలో జరిగిందట.. యువరాణి చిత్రాంగదతో వీరి వివాహం జరిగింది. ఈమె చిత్రాంగద ఏలిన ప్రాంత ప్రస్తుతం ఉన్న మణిపూర్. అర్జునుడికి, చిత్రంగదకి ఒక కుమారుడు జన్మించారు అతని పేరే బబ్రువాహనుడు.