ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా హత్యలు, మానభంగాలు వంటివి ఎక్కువగా జరుగుతున్నట్టు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన అందరిని భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా ఒక మహిళ తన భర్త తలను పగలగొట్టి మరి తలలో ఉండే మెదడును బయటికి తీయడమే కాకుండా వాటితో పాటు అన్ని భాగాలను కూడా బయటికి తీస్తున్న ఒక వీడియో సంచలనంగా మారింది. మరి ఆమె అలా ఎందుకు చేసింది అనే విషయంపై ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


ఉత్తరప్రదేశ్లోని షాజహాన్ పూర్ లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. గాయత్రీ దేవి అనే మహిళ గడిచిన రెండు రోజుల క్రితం తన భర్త సత్యపాల్ ను ఇటుక పేల్లతో తల పగలగొట్టి దారుణంగా హత్య చేసింది.. అయితే గొడవ సమయంలోనే ఈ హింస చెలరేగినట్లు అక్కడ స్థానికులు తెలిపినట్లు పోలీసులు ఫిర్యాదులో తెలియజేశారట. అయితే గాయత్రి తన భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె అతని శరీరం మీద కూర్చొని చాతి పైకి ఎక్కి రాయితో తల అను చీల్చి మెదడును సైతం బయటికి తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


అయితే ఈమె ఇదంతా కూడా పోలీసుల ఎదుట చేసినట్టు కనిపిస్తోంది. దీంతో వెంటనే పోలీసులు ఏమైనా అరెస్టు చేశారు. సత్యపాల్ స్టేడియం సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారట. తరచూ మద్యపానం సమస్య గురించి తన భర్త గాయత్రితో ఎక్కువగా గొడవలు చేసేవారట. అయితే నిన్నటి రోజున ఈ విషయం మరింత ఎక్కువ కావడం చేత తన భర్తను గాయత్రి చితకబాదినట్ల అక్కడ అధికారులు సంజయ్ కుమార్ తెలియజేశారు.. అయితే గాయత్రిని అరెస్టు చేసిన తర్వాత కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆమెకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఈ వీడియో అయితే వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: