అయితే ఈ విషయం బయటికి రానివ్వకుండా కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు కూడా చేశారట. ఈ విషయం పోలీసులకు తెలియగానే ఇది పరువు హత్యగా భావించి వీటిపైన కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తంబెళ్ళపల్లి మండలానికి చెందిన ఒక మైనర్ బాలిక సైతం జులై నెలలో కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు తంబేలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెతికి మరి ఆ అమ్మాయిని అప్పగించారు. ఆగస్టు 12వ తేదీన ఆమె మృతి చెందిందట. ఈ విషయం పైన స్థానికులను సైతం పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే అక్కడ స్థానికులు తెలిపిన ప్రకారం.. మైనర్ బాలిక తమ బంధువుల అబ్బాయితో ప్రేమలో ఉండేదని ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత అతనితో ఇంటి నుంచి వెళ్లిపోయింది కానీ.. మైనారిటీ తీరిన తర్వాతే వివాహం చేస్తామని తల్లితండ్రులు చెప్పినప్పటికీ పోలీసులు సహాయంతో సర్ది చెప్పి మరి ఇంటికి పంపించేశారట. అయితే ఆ అమ్మాయి రెండు రోజుల తర్వాత ఉరి వేసుకొని చెట్టుకు వేలాడుతూ మృతి చెందిందని కొంతమంది గొర్రె కాపారులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చే లోపు ఆమె మృతదేహానికి సైతం అంత్యక్రియలు చేశారట కుటుంబ సభ్యులు. అంతేకాకుండా ఆ అమ్మాయి మృతదేహాన్ని కూడా పొలంలో కాల్చివేసినట్లు తెలుస్తోంది. దీనిపైన పోలీసులు విచారణ జరిపిస్తామని శవాన్ని కాల్చి వేసినట్లుగా రుజువైతే కచ్చితంగా నిందితులకు కఠినమైన శిక్ష విధిస్తామంటూ తెలిపారు.